GET MORE DETAILS

మిస్ వరల్డ్ --మిస్ యూనివర్స్ తేడా ఏమిటి ?

 మిస్ వరల్డ్ --మిస్ యూనివర్స్ తేడా ఏమిటి ?



ఆమధ్య ఇజ్రాయెల్‌లో జరిగిన 'మిస్ యూనివర్స్' పోటీలో భారతదేశానికి చెందిన హర్నాజ్ సంధు విజయం సాధించి చరిత్ర సృష్టించింది. భారత్ నుంచి ఈ టైటిల్‌ను గెలుచుకున్న మూడో మహిళగా రికార్డు సృష్టించింది.

అదే సమయంలో జమైకాకు చెందిన టోనీ-ఆన్ సింగ్ ఈ సారి ప్రపంచ సుందరిగా ఎన్నికయ్యింది. ఈ రెండు పోటీలు ప్రపంచంలోని అందమైన మహిళలను గుర్తిస్తాయి.

విశ్వ సుందరి మిస్ యూనివర్స్ : పోటీ 1952లో ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం యునైటెడ్ స్టేట్స్‌లోని న్యూయార్క్ నగరంలో ఉంది.మిస్ యూనివర్స్ ప్రపంచంలో సానుకూల మార్పు కోసం పని చేయండనేది ఈ పోటీ నినాదం. దీని అధ్యక్షుడు పౌలా షుగర్ట్. ఫిన్లాండ్‌కు చెందిన ఆర్మీ కుసేలా తొలిసారి మిస్ యూనివర్స్ టైటిల్‌ను గెలుచుకుంది.1994లో సుస్మితా సేన్, 2000లో లారా దత్తా, 2021లో హర్నాజ్ సంధు భారత్ నుంచి టైటిల్ గెలుచుకున్నారు.*

ప్రపంచ సుందరి మిస్ వరల్డ్ : ఈ పోటీ 1951లో ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం యునైటెడ్ కింగ్‌డమ్‌లోని లండన్‌లో ఉంది. 'బ్యూటీ విత్ ఎ పర్పస్' లక్ష్యంగా పనిచేస్తుంది. దీని అధ్యక్షురాలు జూలియా మోర్లీ. 1951లో స్వీడన్‌కు చెందిన కికీ హెకెన్‌సెన్ తొలి ప్రపంచ సుందరి. భారతదేశానికి చెందిన 6 మంది మహిళలు మిస్ వరల్డ్ టైటిల్‌ను గెలుచుకున్నారు, వీరిలో ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లార్ ఉన్నారు.

Post a Comment

0 Comments