GET MORE DETAILS

ఎలాంటి భోజనాన్ని చేయాలి ? ఎలాంటి భోజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ?

ఎలాంటి భోజనాన్ని చేయాలి ? ఎలాంటి భోజనం చేయరాదు ? నియమాలు ఏమిటి ?



• కాకులు ముట్టుకున్నదీ, కుక్కా, ఆవూ వాసన చూసిన భోజనాన్ని తినకూడదు. 

• పాలతో భోజనం చేశాక, పెరుగుతో భోజనం చేయకూడదు. 

• కాళ్ళు చాపుకుని, జోళ్ళు వేసుకుని భోజనము చేయరాదు. 

• భోజనముచేయడానికి ఎడమచేయి ఉపయోగించరాదు. నిలవ వున్న అన్నాన్ని భుజింపకూడదు. చల్లారిన అన్నాన్ని వేడిచేసి తినకూడదు. 

• 10-15 పదార్థాలతో భోజనం కన్నా కూర, పప్పు, పచ్చడి, మజ్జిగతో తీసుకునే ఆహారమే అమృతము. నిలువ పచ్చడి కంటే రోటి పచ్చడి ఎంతో శ్రేష్ఠము.

• నిలువ పచ్చళ్ళు వయసులో 2 రోజులకోసారి, మధ్య వయసులో వారానికి 2 సార్లూ, నలభై దాటిన తర్వాత 15 రోజులకొకసారి, యాభై దాటాక నెలకొకసారి తీసుకోవటం ఆరోగ్యకరం. 

• గ్రహణం రోజున అనగా సుర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందుగా, అలాగే చంద్రగ్రహణానికి  తొమ్మిది గంటల ముందుగా ఎలాంటి ఆహారాన్ని తీసుకోకూడదు. 

• దూడను కన్న తర్వాత పశువు నుంచి పదిరోజుల వరకూ పాలు సేవించరాదు.

• తడి పాదాలతో భోజనమూ, పొడి పాదాలతో నిద్ర అనారోగ్యాన్ని కలుగ చేస్తాయి. రాత్రి పడుకొనే ముందు కాళ్ళు కడుక్కుని నిద్రకు ఉపక్రమిస్తే సుఖ నిద్ర పడుతుంది. 

• అలాగే పడుకునేటప్పుడు తప్పనిసరిగా పక్కనే అందుబాటలో మంచినీరు ఉంచుకొనండి. 

• అలాగే గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం నిద్ర మధ్యలో శరీర ధర్మం నిర్వర్తించాల్సివస్తే అలా మగతగా నడుస్తూ వెళ్ళకండి.

• ఎక్కువ ప్రమాదాలు జరిగేది ఆ సమయంలోనే. ఓ క్షణం పూర్తిగా ఇహలోకంలోకి వచ్హి ఆపై శరీరధర్మం తీర్చండి.  

• ఆచమనం చేసిన తర్వాత తీసుకొవాలి.  అన్నమునకు నమస్కరించాలి.  అహారపదార్ధాలను చూసి చిరాకు పడరాదు.  వండిన వార్ని అభినందించాలి.

• అప్పుడే  బలాన్నీ, సామర్ధ్యాన్ని ఇస్తుంది. లేనిచో వికటిస్తుంది. 

• భోజనం మధ్యలో లేవటమూ, మాట్లాడటమూ  తగదు.  ఎంగిలి అన్నాన్ని ఇతరులకు పెట్టరాదు.  భార్యకు సహితము పెట్టరాదు.  పదార్ధాలు బాగున్నాయని అతిగా తింటే ఆయుష్షు తగ్గుతుంది.  భోజనానంతరము కూడా ఆచమనం చేయాలి.

• ఆచమన విధి తెలియనప్పుడు భగవంతుడ్ని స్మరించి ఆపై భుజించాలి.  విస్తరిలో ఏమీ మిగల్చరాదు.  అవసరమైనంతే వడ్డించుకోవాలి.  లేదా వడ్డించమని చెప్పాలి.  ఇష్టం లేని పదార్ధాలను ముందుగానే వద్దనాలి.           

•  రోజుకు రెండుసార్లు భోజనం చేయాలని తైత్తిరీయ బ్రాహ్మణం శెలవిస్తొంది.  రెండుసార్లు మధ్యలో ఏ ఆహారమూ తీసుకొకపోతే  ఉపవాస ఫలం కూడా వస్తుంది.

•  భోజనం చేసేటప్పుడు  తూర్పు వైపుకి తిరిగి చేయాలి.

•  తూర్పు వైపుకి తిరిగి చేయటం వల్ల ఆయుర్ధాయం, అలాగే దక్షిణానికి తిరిగి భోజనం చేస్తే కీర్తి, ఉత్తరం వైపు తిరిగి భొజనం చేస్తే కోరికలు ఫలిస్తాయి.  

•  పడమర, దక్షిణం వైపున భోజనం చెయ్యకూడదని వామన పురాణంలోనూ, విష్ణుపురాణం లోనూ ఉంది.  కాన తూర్పు వైపు తిరిగి భోజనం చేయటం అనేది అన్ని శాస్త్రాలు, ధర్మాలు ఏకగ్రీవంగా వప్పుకుంటున్నాయి. 

•  ఆకుల మీద, ఇనుప పీటల మీద కూర్చొని భోజనం చెయ్యరాదు.

•  ధనాన్ని కోరుకొనే వాడు మఱ్రి, జిల్లేడూ, రావి, తుమ్మి, కానుగ ఆకుల్లో భోజనం చేయాలి. 

•  మోదుగ, తామర ఆకుల్లో సన్యాసులు మాత్రమే భుజించాలి.

•  భోజనానికి  ముందూ, తర్వాత అచమనం చెయ్యాలి.

•  తినే ముందు అన్నానికి నమస్కరించి తినాలి.

Post a Comment

0 Comments