బూస్టర్ డోసు అవసరమనేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు : : ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం
బూస్టర్ డోసు వినియోగంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలు జరుగుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) కీలక వ్యాఖ్యలు చేసింది. కొవిడ్-19 నుంచి రక్షణకు బూస్టర్ డోసు(మూడో డోసు) అవసరమనేందుకు ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరాం భార్గవ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి దేశంలోని అర్హులైన వారందరికీ రెండో డోసు వేయించడమే ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భారత్లో టీకా కార్యక్రమంపై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా బృందం (ఎన్టీఏజీఐ) రానున్న సమావేశంలో బూస్టర్ డోసుపై చర్చించనుందన్న వార్తల నేపథ్యంలో భార్గవ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
0 Comments