జీతం కావాలా... అయితే టీకా ధ్రువపత్రం సమర్పించండి : ప్రభుత్వ ఉద్యోగులకు పంజాబ్ సర్కార్ అల్టిమేటం
ఒమిక్రాన్ కేసులు దేశవ్యాప్తంగా అలజడి సృష్టిస్తుండటంతో పంజాబ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. టీకా కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగా టీకా వేసుకోకపోతే జీతాలు ఇవ్వబోమని ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టం చేసింది. రెండు డోసులు లేదా ఒక డోసు తీసుకున్నవారు తప్పనిసరిగా టీకా ధ్రువపత్రాన్ని సమర్పించాలని, లేకుంటే నెల జీతం బ్యాంక్ ఖాతాలో జమచేయబోమని పేర్కొంది. గడువు ముగిసినా రెండో డోసు టీకా వేసుకోనివారు పంజాబ్లో 35 లక్షల మంది ఉన్నారు. దీంతో ఇటీవల రాష్ట్రప్రభుత్వం టీకా ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది.
0 Comments