సరోగసీ (అద్దె గర్భం)అంటే...
అండాన్ని దాచుకోవచ్చు… కోరుకున్నప్పుడే తల్లి కావచ్చు.. తమ అందాన్ని కాపాడుకోవడానికి, కెరియర్ ఎదుగుదలకు అడ్డు కాకూడదని కోరుకునే సెలబ్రిటీలు, ప్రెగ్నెన్సీ రిస్క్ను కలిగివున్నవారు, దీర్ఘకాలికమైన వ్యాధికి గురై కోలుకునే వారు, ప్రీ-మెచ్యుర్ మెనోపాజ్ సమస్య ఎదురైనవారు, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో లేటుగా పిల్లలను కనాలని భావించేవారు, ఈ సర్రోగసీ ప్రక్రియను ఎంచుకుంటున్నారు. ఇటువంటివారికి వరంగా మారింది ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. సింగిల్ గా ఉన్న పురుషులు కూడా అండాన్ని దాతనుంచి స్వీకరించి ఐవీఎఫ్ ద్వారా తమ శుక్ర కణాలతో సంయోగపర్చి పిండాన్ని సర్రోగసీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టి తండ్రిగా మారుతున్నారు.
ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది...?
తల్లి కావాలనుకున్న మహిళ అండాన్ని మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడాన్ని ఫ్రీజింగ్ చేస్తారు. ఫ్రీజ్ అయిన అండాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడాన్ని థాయింగ్ అంటారు. ఇలా సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి తీసుకువచ్చిన అండంలోకి భర్త వీర్యకణాన్ని చొప్పించి ప్రయోగశాలలో ఫలధీకరణ చేస్తారు. అలా 'పిండం' తయారవుతుంది. ఇలా తయారైన పిండాన్ని తాము ఎంపికచేసుకున్న మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ దంపతుల పిండాన్ని గర్భంలో మోసి అభివృద్ధి అయిన అనంతరం సరోగసీ మదర్ సాధారణ డెలివరీ లేదా సిజేరియన్ ద్వారా ప్రసవిస్తుంది. డెలివరీ అనంతరం ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. వీరి పిండాన్ని తొమ్మిది నెలలపాటు మోసిన మహిళకు ముందే మాట్లాడుకున్న ప్రకారం కొంత డబ్బు అందిస్తారు. ఈ ప్రక్రియ అంతా వైద్యుల పర్యవేక్షణలో సాగుతుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు 40 నుంచి 60 శాతం వరకూ ఉంటాయి. ఐవీఎఫ్, టెస్ట్ట్యూబ్ బేబీ వంటి వాటిల్లో కూడా సక్సెస్ రేటు 60 లోపే ఉంటుంది. భారత్లో సర్రోగసీ గర్బాలు ( గర్భాన్ని మోసి అద్దె మహిళలు) అయ్యే ఖర్చు తక్కువగా ఉండటంతో దేశంలోకి విదేశీ మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.
పిల్లల ఉత్పత్తి కర్మాగారాలుగా మారుతున్న దేశాలు.
ఈ పద్దతిని అవలంభించడంలో ముందు వరుసలో భారత్, అమెరికా, థాయిలాండ్, ఉక్రెయిన్ ఉన్నాయి. 2012 నాటికే సరోగసీ మార్కెట్కు క్యాపిటల్గా మారింది భారత్. ఏడాదికి సరోగసీ టూరిజం విలువ 500 మిలియన్ డాలర్లని అంచనా. సంతాన లేమితో బాధ పడుతున్న జంటలు అద్దె గర్భాలకోసం ఉక్రెయిన్ బాట పడుతున్నారు. అద్దె గర్భాల(సర్రోగసీ) కు ప్రధాన కేంద్రంగా మారింది ఉక్రెయిన్. ఇక్కడ సర్రోగసీ ద్వారా పిల్లలను కని రూ.40-42 లక్షలకు అమ్మకం జరుగుతుంది. ఒక అధ్యయనం ప్రకారం ఉక్రెయిన్లో ఏటా 2500 నుంచి 3000వరకు అద్దె గర్భాల ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. ఉక్రెయిన్ లో పరిశ్రమ స్థాయికి చేరిన వ్యాపారాత్మక అద్దె గర్భాల మార్కెట్. ప్రపంచంలో అద్దె గర్భాలను ఆమోదిస్తున్న అతి కొన్ని దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. ప్రపంచంలో అద్దెగర్భాలు ధరించడంలో ముందున్న దేశాల్లో అమెరికా,భారత్, థాయ్ లాండ్, ఉక్రెయిన్, రష్యా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అద్దె గర్భాల మార్కెట్ విలువ 5 బిలియన్ యూరోలు(రూ.44,146 కోట్లు) ఉంది. ఉక్రెయిన్లో అద్దె గర్భం సగటు విలువ రూ.22 లక్షలు నుంచి రూ.61 లక్షలు.. అన్ని రకాల సర్రోగసీని నిషేధించిన దేశాల్లో.. ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్, బల్గేరియా ఉన్నాయి.
యూకే, ఐర్లండ్, డెన్మార్క్, బెల్జియం, సర్రోగసీకి అనుమతి ఉన్నప్పటికీ..ఈ దేశాల్లో అద్దె గర్భం మోసిన తల్లికి సాధారణ ఖర్చులు మినహా వ్యాపారాత్మక ధోరణితో డబ్బు చెల్లించడం నిషేధించారు. కమర్షియల్ సర్రోగసీ(వ్యాపారాత్మక అద్దెగర్భాలు) ఒప్పుకున్న దేశాల్లో భారత్(2002), రష్యా, ఉక్రెయిన్, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి.
భారత్ లో తాజా చట్టం...
2021లో అద్దె గర్భం నియంత్రణ చట్టం-2021 పేర దీన్ని పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టంలో భాగంగా వితంతువులు, విడాకులు పొందిన వారూ ఇతరులకు తమ గర్భాన్ని అద్దెకు ఇవ్వడానికి కేంద్రం ఆమోదించింది. ఇది వాణిజ్యపరమైన సరోగసీని నిషేధిస్తుంది. గర్భధారణ సమయంలో వైద్య ఖర్చులు, భీమా కవరేజీ మినహా అద్దె తల్లికి ఎలాంటి ద్రవ్య పరిహారాన్ని కలిగి ఉండని, పరోపకార సరోగసీని మాత్రమే అనుమతిస్తుంది.
అనైతిక సరోగసీ నియంత్రణకు చట్టంలో కొన్ని నిబంధనలు విధించారు, వాటిలో...
1. దంపతులిద్దరూ భారతీయులై ఉండాలి.
2. వంధ్యత్వంతో బాధపడుతున్న జంటలు సరోగసీని స్వీకరించవచ్చు.
3. అయితే జంటకు వివాహమై అయిదేళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పూర్తవ్వాలి.
4. ఇద్దరిలో ఒకరు వంధ్యత్వంకు గురైతే సరోగసీని ఎంచుకునేందుకు అనుమతి.
5. పరోపకారం కోసం స్వీకరించవచ్చు.
6.వాణిజ్య ప్రయోజనాల కోసం చేయరాదు.
7. అమ్మకం, వ్యభిచారం లేదా ఇతర రకాల దోపిడీ కోసం పిల్లలను ఉత్పత్తి చేయడం చేయరాదు.
8. నిబంధనలలో పేర్కొన్న ఏదైనా వ్యాధి, పరిస్థితుల్లో సరోగసీని స్వీకరించవచ్చు.
9. భార్య వయసు 23 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. భర్త వయసు 26 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.
10. సరోగసీ ప్రక్రియకు వెళుతున్న దంపతులకు.. తమకు పుట్టినవారైనా లేదా దత్తత తీసుకున్న పిల్లలు ఉండకూడదు.
11.మేజిస్ట్రేట్ కోర్టు నుంచి బిడ్డ పేరెంటింగ్, కస్టడీ ఆర్డర్ తీసుకోవాలి.
12. అద్దె గర్భం మోసే తల్లికి 16 నెలల బీమా రక్షణ కల్పించాల్సింది ఆ దంపతులే.
అద్దె గర్భం మోసే తల్లికి నిబంధనలు :
1. అద్దె గర్భం మోసేందుకు అర్హత సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేయాలి.
2. సరోగసీకి వెళుతున్నజంటకు ఆమె దగ్గరి బంధువై ఉండాలి.
3. సరోగేట్ తల్లి వివాహితురాలై ఉండాలి.
4. ఆమెకు కనీసం ఒక బిడ్డ అయినా ఉండాలి. ఆమె వయసు 25 నుంచి 30 ఏళ్లు ఉండాలి.
5. మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలి.
6. ఒక మహిళ తన జీవితకాలంలో ఒకసారి మాత్రమే సరోగసీ ద్వారా బిడ్డను కనాలి.
భారత్లో ఏటా దాదాపు 25వేల పిల్లలు సర్రోగసీ ద్వారా జన్మిస్తున్నారని అంచనా. మెక్సికో, నేపాల్, పోలండ్, జార్జియాల్లో సైతం సర్రోగసీకి అనుమతి ఉన్నట్లు వెల్లడించింది. వ్యాపారాత్మక సర్రోగసీ కోసం ఇతర దేశాలకు వెళ్లడాన్ని నిషేధించిన ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచంలో సర్రోగసీ సగటు ఖర్చు(లాభేతర సర్రోగసీ సంస్థ అధ్యయనంలో వెల్లడైన అంచనాలు 2014 సంవత్సరంలో) అమెరికా- లక్ష డాలర్లు, భారత్- 47,350 డాలర్లు, థాయ్ -లాండ్-52వేల డాలర్లు, ఉక్రెయిన్- 49,950 డాలర్లు, జార్జియా- 49,950 డాలర్లు, మెక్సికో-45వేల డాలర్లు, ఆస్ట్రేలియాలో వాణిజ్యపరమైన సరోగసీపై నిషేధం ఉంది. కెనడాలో సైతం వాణిజ్యపరమైన సరోగసీకి అనుమతి లేదు. దగ్గరి బంధువుల ద్వారా సరోగసీ చేపట్టేందుకు మాత్రమే అనుమతి ఉంది. చైనాలో నిషేధం. ఫ్రాన్స్, జర్మనీలో సరోగసీ చట్ట వ్యతిరేకమని వెల్లడైంది. అమెరికాలో .. సరోగసీ నిబంధనలు వివిధ రాష్ట్రాల్లో వేరుగా ఉన్నాయి. అయితే చాలా రాష్ట్రాల్లో సరోగసీకి అనుమతి లేదు. ఈ పద్ధతిని కేవలం వైద్యపరమైన ప్రతిబంధకాలు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంది. ఎగ్ ఫ్రీజింగ్ ప్రక్రియను ఇటీవలే బ్యాన్ చేసిన సింగపూర్. ఇక్కడ జననాలు రేటు 1.1 కనిష్ట స్థాయికి చేరడంతో బ్యాన్ చేసింది సింగపూర్.
సరోగసీ పద్దతిలో తల్లయిన సెలబ్రిటీలు :
1. షారుక్ఖాన్, గౌరీ
2. అమీర్ఖాన్, కిరణ్రావు
3. ఫరాఖాన్, శిరీష్ కుందర్
4. తుషార్ కపూర్ (సింగిల్ పేరెంట్)
5. ఏక్తా కపూర్ (సింగిల్ పేరెంట్)
6. కరణ్ జోహార్ (సింగిల్ పేరెంట్)
7. మంచు లక్ష్మి, ఆండీ శ్రీనివాసన్
8. సన్నీలియోన్, డానియల్ వెబర్
9. ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్
10. విఘ్నేశ్- నయనతార
0 Comments