డాక్టరేట్ సాధించిన ఎమ్మెల్యే సీతక్క.
ములుగు ఎమ్మెల్యే సీతక్క (డి.అనసూయ) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ సాధించారు. ఓయూ మాజీ ఉపకులపతి, మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ ఛాన్స్లర్ ప్రొ.తిరుపతిరావు పర్యవేక్షణలో ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని గొత్తికోయ గిరిజనుల సామాజిక స్థితిగతులపై రాజనీతిశాస్త్రంలో ఆమె పరిశోధన పూర్తి చేశారు. అనంతరం సీతక్క సమర్పించిన సంబంధిత గ్రంథాన్ని పరిశీలించిన అధికారులు ఆమెకు పీహెచ్డీ ఇస్తున్నట్లు సోమవారం ప్రకటించారు.
0 Comments