GET MORE DETAILS

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం ఎందుకు వెలిగించాలి ?

కార్తీక మాసంలో దారి చూపే ఆకాశ దీపం ఎందుకు వెలిగించాలి ?




కార్తీక మాసం... ఆకాశ‌దీపం... 


ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉంది, గుడుల్లో ఆకాశ‌ దీపాన్ని ఎందుకు వెలిగిస్తారో మీకు తెలుసా?

శివుడికి, విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్ర‌మైన‌ది కార్తీక మాసం, ఈ మాసం ప్రారంభం కాగానే దేవాలయాల్లో ధ్వజ స్తంభానికి ‘ఆకాశ దీపం’ వేళాడదీస్తుంటారు. చిన్న చిన్న రంధ్రాలు చేసిన ఓ గుండ్రని ఇత్తడి పాత్రలో నూనె పోసి ఈ దీపాన్ని వెలిగిస్తారు. తాడు సాయంతో ఈ పాత్రను పైకి పంపించి, ధ్వజ స్తంభం పైభాగాన వేలాడదీస్తారు. 

ఈ దీపంలో నూనె పోయడానికి, ఈ దీపాన్ని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకి వెళుతూ వుంటారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలవడానికి, ధ్వజ స్తంభానికి వేలాడదీయడానికి కారణం ఉంది. 

ఆకాశ దీపం దూరంగా ఉన్న మానవులు దర్శించడానికి కాదు, ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని శాస్త్రం చెబుతోంది. ‘దీపావళి’ రోజున రాత్రి లక్ష్మీ పూజ చేస్తారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ రోజు మధ్యాహ్నం చాలామంది తమ పితృ దేవతలకు తర్పణం వదులుతుంటారు. 

కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృ దేవతలంతా ఆకాశమార్గాన తమతమ లోకాలకు ప్రయాణం చేస్తుంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తుంటారు.

Post a Comment

0 Comments