GET MORE DETAILS

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత ? పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు ?

శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనంకు ఎందుకు అంత ప్రాధాన్యత ? పదిరోజులు పాటు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం ఎందుకు కల్పిస్తారు ?



ఏ రోజు దర్శనం చేసుకుంటే మంచి ఫలితాలు సిద్దిస్తాయి ?

* మానవులుకు 365 రోజులు, దేవతలకు ఒక్కరోజుతో సమానం

* మానవులుకు 6 నెలల కాల సమయం, దేవతలకు 12 గంటల సమయం.

* దేవతలకు 12 గంటల రాత్రి సమయాని దక్షిణాయం అని, పగలు 12 గంటల సమయాని ఉత్తరాయణం అని అంటారు.

*  దక్షిణాయంలో మహవిష్ణువు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు సేద తీరే సమయం. దీనినే కర్కాటక మాసం అంటారు.

* రాత్రి 8గంటలకు మహవిష్ణువు నిద్రకు ఉపక్రమించే సమయం. 8 నుంచి 10 గంటల సమయాని సింహ మాసం అంటారు.

* రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య మహవిష్ణువు ప్రక్క తిరిగి పడుకునే సమయం. ఈ కాలం మానవులుకు కన్యా మాసం. 

* అర్దరాత్రి 12గంటల నుంచి వేకువజాము 2 గంటల వరకు మహవిష్ణువు గాడ నిద్రలో వుండే సమయం. మానవులుకు తులామాసం.

* మహవిష్ణువు నిద్రలేచే సమయం వేకువజాము 2 గంటల 40 నిముషాలకు. ఉదయం 2 నుంచి 4 గంటల సమయాని మానవులుకు వృశ్చికమాసం.

* మహవిష్ణువు నాలుగు గంటల నుంచి నాలుగు గంటల నలభై నిముషాల వరకు ముక్కోటి దేవతలకు దర్శనభాగ్యం కల్పిస్తారు. ఉదయం 4 నుంచి 6 గంటల కాలాని దనుర్మాసంగా పిలుస్తారు.

* దేవతలకు ఒక్క గంట సమయం. మానవులుకు 15.2 రోజులుతో సమానం.

* దేవతలకు 40 నిముషాల సమయం మానవులుకు 10 రోజులుతో సమానం.

* ఈ 10 రోజులు కాలమే శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరిచే పదిరోజులు.

* దీనితో వైకుంఠ ఏకాదశి నుంచి పది రోజులు వ్యవధిలో ఏ రోజు దర్శనం చేసుకున్నా ఉత్తమ ఫలితాలే భక్తులుకు సిద్దిస్తాయి.

Post a Comment

0 Comments