కరోనా ఒమిక్రాన్ రూపంలో బాగా విసరిస్తోంది. చాలా అప్రమత్తంగా ఉండండి. ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు.
ఓమిక్రాన్ సోకిన వారికి కనిపించే లక్షణాలు :
1. జలుబు, గొంతు గరగర, ఒక్కోసారి దగ్గు. ఈ లక్షణాలు చాల మందిలో కనిపిస్తున్నాయి.
2. జ్వరం.. కొద్ది మందిలో మాత్రమే కనిపిస్తోంది . ఎక్కువ మందికి జ్వరం రావడం లేదు . కొంతమందికి మాత్రం ఒక రోజు లేదా రెండు రోజులు జ్వరం వస్తోంది . కొంతమందిలో జ్వరం ఎక్కువగా అంటే 103 డిగ్రీ ల దాక వచ్చి తగ్గిపోతోంది. జ్వరం 102 దాటితే ఒంటిని ని తడిబట్ట తో తుడవండి. దీన్ని స్పాంజింగ్ అంటారు.
3. తక్కువ మందిలో కడుపు నొప్పి, వాంతులు.. ముఖ్యంగా ఇరవై ఏళ్ళు లోపు వారిలో ఇది కనిపిస్తోంది. వాంతులు అవుతున్నప్పుడు మజ్జిగ కొబ్బరి నీరు లాంటివి బాగా తాగాలి. వాంతులు ఒకటి రెండు రోజుల్లో తగ్గిపోతాయి.
4. వొళ్ళు నొప్పులు, కాళ్ళు లాగినట్టు ఉండడం, నీరసం.
చేయాల్సినవి :
1. పై లక్షణాలు కనిపిస్తే B, C, D విటమిన్ మాత్రలు, జింక్ మాత్ర వారం పాటు తీసుకోండి. జ్వరం వున్నప్పుడు మాత్రం పారాసెటమాల్ 500 మాత్ర తీసుకోండి. పారాసెటమాల్ అదే పనిగా తినొద్దు. పదేళ్ల లోపు పిల్లలకు విటమిన్ మాత్రలకు బదులుగా మల్టీ విటమిన్ సిరప్ ఇవ్వండి. ఇవి కాకుండా డాక్టర్లను సంప్రదించకుండా మరే ఇతర మాత్రలు వద్దు. అంటి బయటిక్ మాత్రలు అవసరం లేదు. మాల్పురంవీర్ అనే మాత్రలు కొంతమంది తీసుకొంటున్నారు. ఇవి తీసుకొంటే కాన్సర్ వచ్చే ప్రమాదం వుంది అని icmr హెచ్చరించింది. జాగ్రత్త . అది తింటే పిల్లలు పుట్టరు అనే రూమర్స్ ఉన్నయి, వైద్యుల సలహా తీసుకునివాడండి.
2. వేడి నీరు తాగాలి. పెద్దలు రోజుకు నాలుగు లీటర్లు. పిలల్లు రెండు లీటర్లు. గొంతులో గరగర /దగ్గు పోవడానికి వేడి నీటిలో ఉప్పు వేసి తల పైకెత్తి బాగా గొంతులో తిప్పి మూసేయండి. జలుబు, దగ్గు చాల మందిలో రెండు రోజుల్లో తగ్గిపోతోంది. నాలుగైదు రోజులు దగ్గు తుమ్ములు వున్నా భయపడాల్సింది ఏమీ లేదు .
4. నాన పెట్టిన బాదాం రెండు, షుగర్ లేని వారు రోజుకు ఒక అరటి పండుతినాలి. అందరూ పాలకూర, తోట కూర, అల్లం వెల్లులి కనీసం వారం తినాలి. వీటిని మీకు తోచిన రీతిలో వండుకోండి. ఇది మన ఇమ్మ్యూనిటిని బలోపేతం చేస్తుంది.
5. అల్లం పసుపు కషాయం రోజుకు ఒక సారి కేవలం మూడు రోజులు టీ లాగా తాగండి. ఎక్కువ తాగొద్దు. వాంతులు అయ్యేవారికి కషాయం వద్దు.
ఇప్పుడు విసరిస్తున్నది ఓమిక్రాన్. కానీ అక్కడక్కడా డెల్టా కూడా వ్యాపిస్తోంది. మనకు సోకింది డెల్టా నా ఓమిక్రాన్ నా అని తెలిసే అవకాశం లేదు. చిన్న పాము నైనా పెద్ద కర్ర తో కొట్టాలి అంటారు. కాబట్టి అందరూ పల్స్ ఆక్సీమేటర్ తో చెక్ చేసుకోండి. అందులో sp ౦ 2 .. 94 అంతకంటే ఎక్కువ ఉంటే సమస్యే లేదు . లేచి కూర్చుని చెక్ చేసుకోండి. పడుకొని, కిటికీలు మూసి చెక్ చేస్తే ఒక్కో సారి 93 లేదా 92 రావొచ్చు. గాబరా పడొద్దు. వేలు పెట్టిన ముప్పై సెకండ్స్ కు వచ్చే రీడింగ్ చూడాలి. ముందుగా ఎంత వుంది అనేది లెక్కలోకి తీసుకోవద్దు. 91 కంటే రీడింగ్ తక్కువ ఉంటే సోకింది డెల్టా అది ఊపిరి తిత్తుల్ని దెబ్బ తీస్తోంది అని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే కరోనా ఈ మూడో వేవ్ లో లక్షలాది మందికి సోకింది. ఎవరికీ ఇలాంటి అవసరం రాలేదు. ముందు జాగ్రత్త గా చెప్పాను. కంగారు పడొద్దు.
డెల్టా సోకితే అయిదవ రోజుకు రుచి లేదా వాసన లేదా రెండు పోతుంది . ఆలా వాసన రుచి పోలేదంటే అది ఓమిక్రాన్ అని అర్థం . రుచి వాసన పొతే నువ్వుల లడ్డు రోజుకు ఒకటి పది రోజులు తినండి . పోయిన రుచి వాసన తిరిగి వచ్చేస్తాయి . కాస్త ఆలస్యం అయితే కంగారొద్దు .
ఓమిక్రాన్ సోకిన నూటికి తొంబై మందిలో ఎలాంటి లక్షణాలు కనపడడం లేదు. లక్షణాలు ఉన్నా అవి రెండు మూడు రోజుల్లో పోతున్నాయి. కాబట్టి ఎక్కువ భయం, ఆందోళనలు వద్దు. ఇప్పుడు సోకుతున్న వారిలో నూటికి తొంబై తొమ్మిది ఓమిక్రాన్, డెల్టా ఎక్కడో ఒక చోట కనిపిస్తోంది.
మనకు సోకింది కరోనా కదా అని తెలుసుకోవాలనే ఆసక్తి భయం వద్దు. RTPCR యాంటిజెన్ లాంటి టెస్ట్ ల వద్దు. వైరస్ రెండు రోజుల్లో చనిపోతుంది . టెస్ట్ కు వెళ్లే లోపే పోతుంది. కాబట్టే దక్షిణాఫ్రికా స్పెయిన్ లాంటియూ అనేక దేశాలు అసలు టెస్ట్ లు అవసరం లేదని చెప్పాయి. కొంత మంది వెళ్లి టెస్ట్ చేయించుకొంటున్నారు. అక్కడ పాజిటివ్ అని తేలితే కొన్ని ఆసుపత్రులు డి దిమ్మెర్ CRP, బ్లడ్ టెస్ట్ అంటూ ఒక డజను టెస్ట్ లు చేయమని అడుగుతున్నారు. ఓమిక్రాన్ కోసం ఇలాంటి టెస్ట్ లు ఏవీ అవసరం లేదు. ఇది నా మాట కాదు. దేశంలోని ప్రముఖ డాక్టర్ లు నిన్న ఈ మేరకు పత్రికా ప్రకటన జారీ చేసారు. రెండో వేవ్ సందర్భంగా రోగులకు స్టెరాయిడ్ లాంటివి ఇచ్చి ఆరోగ్యాన్ని చెడగొట్టారు. ఇలాంటి ప్రయత్నాలు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు. కాబట్టి జాగ్రత్త. చికిత్స పేరుతొ అనారోగ్యాన్ని కొని తెచ్చుకోవద్దు.
ఓమిక్రాన్ సోకి ఇంట్లో ఉంటే రెండు రోజుల్లో తగ్గిపోతుంది. అనవసర టెస్ట్ లు.. సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే మందులు తిని ఆరోగ్యాన్ని చెడకొట్టుకోవద్దు. డబ్బు ఎక్కువైతే ఉద్యోగం పోగొట్టుకొని బాధ పడుతున్నవారికి విరాళం ఇవ్వండి. పిచ్చి టెస్ట్ ల తో పిచ్చి మాత్రలతో ఇంటిని ఒంటిని గుల్ల చేసుకోవద్దు.
ఆసుపత్రికి ఎప్పుడు వెళ్ళాలి...?
1. జ్వరం ఆరో రోజుకు కూడా తగ్గక పొతే...
2 .పల్స్ ఆక్సీమీటర్ లో ఆక్సిజన్ శాతం 94 నుంచి తగ్గడం మొదలై 91 చేరుకున్నప్పుడు అంబులెన్సు పిలవాలి. అప్పుడు ఆలస్యం వద్దు. ఇలాంటి అవసరం ఈ మూడ్ వేవ్ లో ఎవరికీ రాలేదు.
పల్స్ ఆక్సీమేటర్ లో SPO2 కాకుండా మరొక రీడింగ్ వస్తుంది. చూసారా? అది వంద లోపు ఉంటే మీ ఒంట్లో నిలకడ లేనట్టు. జ్వరం వల్ల ఒంట్లో నిలకడ ఉంటే అది 120 -130 దాకా ఉంటుంది. కంగారొద్దు. అదేమీ డేంజర్ కాదు . అయ్యో పల్స్ రీడింగ్ ఎక్కువ వుంది. వందకు తగ్గాలి అని మీరు కంగారు పడితే అది టెన్సన్ వల్ల పెరుగుతుంది. లైట్ గా తీసుకోండి. సాధారణంగా వైరస్ సోకి లక్షణాలు వున్నప్పుడు అంటే తొలి రెండు మూడు రోజులు అది వందకు పైన ఉంటుంది. వైరస్ చచ్చి మీరు ఆరోగ్యం కుదుటపడుతుంటే అది వంద అంతకంటే తక్కువ యిపోతుంది. మీకు ఇదివరకే బిపి ఉంటే ఇది ఎక్కువగా ఉంటుంది. దాన్ని గురించి భయం వద్దు. కానీ చాలా అప్రమత్తంగా ఉండాలి.
0 Comments