తిరుమల న్యూస్
● శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్టు ధరల పెంపుదల ప్రతిపాదనను ఉపసంహరించుకున్న టీటీడీ.
● సిఫార్సు లేఖలపై కేటాయించే సేవ టిక్కెట్టు ధరలపై పెంచుతామని ఇటీవల ప్రకటించిన టీటీడీ.
● భక్తుల నుండి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో ధరల పెంపు ఆలోచనను విరమించుకున్న టీటీడీ.
● ఏప్రీల్ నుండి అన్ని ఆర్జిత సేవలను పునఃప్రారంభిస్తాం.
● ఇప్పట్లో ఏ సేవలు, దర్శనాలు టిక్కెట్టు ధరలను పెంచే ఆలోచన టీటీడీ కు లేదు.
● సామన్యభక్తులకు పెద్దపీట వేసేందుకు పలు చర్యలు తీసుకుంటున్నాం.
● శుక్ర,శని,అదివారాలు సిఫార్సు లేఖలపై విఐపీ బ్రేక్ దర్శనం కేటాయింపు రద్దు చేసాం.
● ఏరోజుకు ఆరోజు దర్శనం చేసుకునేలా రోజుకు 30వేల సర్వదర్శనం టోకన్లు భక్తులకు కేటాయిస్తున్నాం.
● భక్తులందరికీ ఉచితంగా అన్నప్రసాదం అందించాలనేది ఆలోచన మాత్రమే.
● స్థానిక హోటల్ వ్యాపారులకు ఇబ్బంది కలిగించం.
● హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు యధావిధిగా నడుస్తాయి.
● భక్తులకు విరివిగా అన్నప్రసాదం అందించేందుకు కౌంటర్లు ఏర్పాటు చేస్తాం.
– వైవీ సుబ్బారెడ్డి, టీటీడీ చైర్మన్
0 Comments