GET MORE DETAILS

నేడు నృసింహ ద్వాదశి : ఫాల్గుణ మాసం శుక్లపక్ష నృసింహ ద్వాదశి నాడు గంగానదిలో స్నానం చేస్తే ?

నేడు నృసింహ ద్వాదశి : ఫాల్గుణ మాసం శుక్లపక్ష  నృసింహ ద్వాదశి నాడు గంగానదిలో స్నానం చేస్తే...?



ఫాల్గుణ మాసాన్ని సర్వదేవతా వ్రత సమాహారంగా పేర్కొంటారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్టచివరిది ఫాల్గుణ మాసం. శిశిర రుతువుకు ముగింపు పలికే ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ వ్రతం చేస్తారు. ఫాల్గుణ శుద్ధ పాడ్యమినాడు భద్ర చతుష్టయం , విదియనాడు మధూకం వంటి వ్రతాలను చేస్తారు. 

అలాగే ఫాల్గుణ శుద్ధ చవితినాడు అవిఘ్నగణపతి వ్రతం చేస్తారు. పంచమి నాడు అనంత పంచమీవ్రతం , సప్తమినాడు ఆర్కసంపుట సప్తమీ లాంటి వ్రతాలు , అష్టమినాడు దుర్గాష్టమిగా కూడా పేరున్న లలిత కాంతీ దేవీ వ్రతం చేస్తారు. నవమి నాడు ఆనంద నవమీ వ్రతం , ఏకాదశీ నాడు అమలక (ఉసిరి), ఏకాదశి , ద్వాదశి నాడు గోవింద ద్వాదశి , చతుర్దశి రోజు మహేశ్వర వ్రతం, లలిత కాంతి వ్రతం జరుపుతుంటారు. 

అందుచేత ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశి న వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు. ఫాల్గుణ శుద్ద ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామిని ఈ రోజున పూజించే వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఇంకా ద్వాదశి నాటి గంగాస్నానం పాపనాశనమని పురోహితులు చెబుతున్నారు. 

ఆలయాల్లో ప్రత్యేక పూజలు , అభిషేకాలు నిర్వహించడం , ఆ రోజున మహిళలు సీతామాత పూజ , విష్ణుపూజ చేస్తే సకల సంపదలు చేకూరుతాయి. విష్ణువుకు ప్రీతికరమైన ఈ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశికి ముందు 12 రోజులు పయోవ్రతం ఆచరించి విష్ణుదేవుడికి క్షీరాన్నం నివేదిస్తే అభీష్టం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. ఇంకా ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం చేస్తే సువర్ణ , పుత్ర లాభాలు చేకూరుతాయని పండితులు అంటున్నారు.

Post a Comment

0 Comments