GET MORE DETAILS

దేవాలయానికి వెళ్ళినపుడు గంట మూడు సార్లే ఎందుకు కొట్టాలి తెలుసా ?

దేవాలయానికి వెళ్ళినపుడు గంట మూడు సార్లే  ఎందుకు కొట్టాలి తెలుసా ?

 


శ్లోకము :

ఏకతాడే మరణం చైవ

ద్వితాడే వ్యాధి పీడనం !

త్రితాడే సుఖమాప్నోతి  తత్ఘంటానాదలక్షణం ! ! 

భావం : దేవుని ముందర ఘంట ఒకసారి మాత్రమే కొట్టి ఊరుకుంటే అది మన మరణానికి సంకేతం. రెండుసార్లు కొట్టి ఊరుకుంటే వ్యాధుల ద్వారా పీడింపబడతాము. మూడుసార్లు ఘంటానాదం చేయడం చేత శరీరమునకు , మనస్సుకు సుఖము కలుగుతుంది.

ఈ పద్దతిని దేవాలయ ఘంటా నాద లక్షణము గా శాస్త్రం చెప్పబడింది .

( దేవాలయంలో ఘంటానాదం ద్వారా జనించే ఓంకార ధ్వని తరంగాలను మన చెవుల ద్వారా శరీరంలోకి శబ్ద తరంగాలకు అనుసంధానం చేయండి తద్వారా మానసిక ప్రశాంతతను పొందండి ).

Post a Comment

0 Comments