GET MORE DETAILS

సచివాలయంల్లోనే ఆధార్ సేవలు

 సచివాలయంల్లోనే ఆధార్ సేవలు




● అందుబాటులోకి తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం.

● రాష్ట్ర వ్యాప్తంగా 3,000 గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పాట్లు.

● ఇప్పటికే 1,100 కేంద్రాల్లో ప్రారంభమైన ఆధార్‌ సేవలు.

● మొదటి సారి ఆధార్‌ నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితం.

● కలర్‌ ప్రింట్, అడ్రస్‌ మార్పు తదితర సేవలకు యూఐడీఏఐ నిర్ధారిత చార్జి.

● విధివిధానాలపై జిల్లా కలెక్టర్లకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆధార్‌ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు గ్రామ వార్డు సచివాలయాల శాఖ పేర్కొంది.

తొలిసారి ఆధార్‌ వివరాలు నమోదు చేసుకునే వారికి పూర్తి ఉచితంగా సేవలు అందజేస్తారని ఆ శాఖ తెలిపింది. నిబంధనల ప్రకారం ఐదేళ్ల నుంచి 15 ఏళ్ల మధ్య పిల్లల ఆధార్‌ బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ చేసుకునే వారికి కూడా ఒకసారి ఉచిత సేవలు అందిస్తారని వెల్లడించింది.

అయితే, ఆధార్‌ కలర్‌ ప్రింట్, బయోమెట్రిక్‌లో తప్పులు సరిదిద్దడం, అడ్రసు తదితర వివరాల్లో మార్పులకు ఆధార్‌ నమోదు సంస్థ(యూఐడీఏఐ) నిర్ధారించిన సర్వీసు చార్జి ఉంటుందని పేర్కొంది. 

Post a Comment

0 Comments