GET MORE DETAILS

శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ?

 శివునికి రుద్రాభిషేకం ఎందుకు చేస్తారు ?



దీర్ఘవ్యాధులు ఉన్నవారు తమ వ్యాధులు పోవాలనీ, మిగతా వారు కోరికలతోనూ, భక్తితోనూ, శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విధంగా చెయ్యటం వల్ల మరణ భయం పోతుందని పురాణాలు చెపుతున్నాయి.

రుద్రాభిషేకం చేయించేవారు ఒక ముఖ్య విషయంను గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమును శివ సంచారము గురించి తెలుసుకొని చేయించుకోవాలి.

మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని రుద్రాభిషేకం చేయించుకోవటం మంచిది .శివపూజ చేసే తిథిని 10 తో హెచ్చ వేస్తే అనగా “0” చేర్చి 7తో భాగిస్తే “1” వస్తే కైలాసమున, “2” వస్తే పార్వతీదేవి వద్ద, “3” వస్తే వాహనుడై ఉన్నట్టు, “4” వస్తే కొలువు తీరినట్లు, “5” వస్తే నైవేద్యము స్వీకరిస్తున్నట్లు, “6” వస్తే ఆనంద నాట్యము చేస్తున్న సమయముగా, “7” వస్తే స్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి.7-14 తిథులలో పూజ అసలు చేయకూడదు.వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి. అప్పుడే మంచి ఫలితం ఉంటుంది.

Post a Comment

0 Comments