ఏపీ పట్టాలు ఎక్కనున్న దేశం మెచ్చిన వందేభారత్..విశాఖ టు విజయవాడ జర్నీ కేవలం 4 గంటలే...!
బుల్లెట్లా దూసుకెళ్తూ విశాఖ నుంచి విజయవాడ మధ్య ప్రయాణ సమయాన్ని తగ్గించే అత్యాధునిక హైస్పీడ్ రైలు వందేభారత్ అతి త్వరలో పట్టాలెక్కనుంది. వందేభారత్ రైలు స్టార్ట్ అయితే కేవలం 4 గంటల్లోనే విశాఖపట్నం నుంచి విజయవాడకు చేరుకోవచ్చు.
సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్న కష్టాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందు మన విశాఖపట్నం నుంచి విజయవాడ మధ్య వందేభారత్ రైలును డిసెంబర్ నెలలో ప్రారంభించేందుకు సిద్ధం అవుతుంది.
రైల్వే బోర్డు ఇప్పటికే విశాఖపట్నం డివిజన్కు 8 కోచ్లతో కూడిన రెండు యూనిట్స్ వందేభారత్ రైలును కేటాయించింది. అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటుచేసిన ఈ రైలు ఒక్కసారి పట్టాలు ఎక్కితే విజయవాడ, వైజాగ్ల మధ్య జర్నీ టైం చాలా తగ్గుతుంది..మనం చాలా సింపుల్గా జర్నీ చేయవచ్చు.
0 Comments