GET MORE DETAILS

భోగి అంటే ఏమిటి ? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? భోగి మంట,భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ?

భోగి అంటే ఏమిటి ? ఈ భోగి పండుగ ఎలా వచ్చింది ? భోగి మంట,భోగిపళ్ళ వెనుక దాగిన రహస్యాలు ఏమిటి ? 



పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటి రోజును మనం భోగి పండుగగా జరుపుకుంటాం.

దక్షిణాయణంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవడంవలన భూమిపై బాగా చలి పెరుగుతుంది.ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందు రోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అంటారని మన అందరికి తెలిసింది.మరైతే ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు "శాస్త్రీయ కారణాలు" తెలుసుకుందాం.

"భుగ్"అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం.

పూర్వం ఈ దినమే శ్రీ రంగనాధస్వామిలో గోదాదేవి లీనమై భోగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణగాధ... శ్రీ మహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణగాధ.. మనందరికీ తెలిసిందే అయితే తరువాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని,ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశీర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతు గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రోజు ఇదే.శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాధ.

సాధారణంగా అందరు చెప్పేది,ఇది చలికాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని.కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు,ఆరోగ్యం కోసం కూడా.ధనుర్మాసం నెలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు.వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు.దేశి ఆవు పేడ పిడకలని కాల్చడంవలన గాలి శుద్ధిఅవుతుంది. సూక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది.దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది.చలికాలంలో అనేక వ్యాదులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది.భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రావి,మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల బెరడ్లు వేస్తారు.అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు.అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశి ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (Ooxygen)ను విడుదల చేస్తుంది.ఈ ఔషద మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడంవలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది.మన శరీరం లోని 72,000 నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది.ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు,అదే అందరికి వస్తే అందరికి ఔషధం సమకూర్చడం దాదాపు అసాధ్యం.అందులో కొందరు వైద్యం చేయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మద్యన దూరాలను తగ్గిస్తుంది, ఐక్యమత్యాని పెంచుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధన,మరో రకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

కాని మనం ఫాషన్, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లను పెట్రోలు పోసి తగల బెట్టి,దాని విష వాయువులను పీలుస్తూ, కాలుష్యాన్ని చేస్తూ మన ఆరోగ్యాన్ని తగలేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తునం.ఉన్న రోగాలే కాక కొత్త రోగాలని తెచ్చుకుంటున్నాం.ఇక భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని వింటుంటాం.పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు,వైర్లు లాంటివి కావు.

ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచుకోవాలి.మన భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కాని భారతదేశాని ఆక్రమించు కోలేమనుకున్న బ్రిటిషు దండుగులు,భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల సంవత్సరాలుగా వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచిన తాళపత్ర గ్రంధాలను భోగి మంటల్లో వేసి కాల్పించేసారు.నిజానికి భోగి మంటల్లో కాల్చాల్సింది పాత వస్తువులని కాదు,మనలోని పనికిరాని అలవాట్లు,చెడు లక్షణాలు.అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు వస్తాయి.

భోగి పళ్ళను పోయడంలోని అంతరార్దం తెలుస్సుకుందాం...

భోగి రోజున భోగి పళ్ళు పేరుతో రేగి పళ్ళను పిల్లల మీద పోస్తారు.రేగి చెట్టుకు బదరీ వృక్షం అనే సంస్కృత పేరు.రేగి చెట్లు,రాగి పండ్లు శ్రీమన్నారాయణ స్వామి ప్రతి రూపం.ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన ఫలం. సూర్యుని రూపం,రంగు,పేరు కలిగిన రేగుపళ్ళతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు.వాటిని తలపై పోయడంవలన శ్రీ లక్ష్మినారాయణుల అనుగ్రహం మన పిల్లలఫై ఉంటుంది అని,పిల్లలకి ఉన్న దిష్టి తొలగి పోయి వారి ఎదుగుదలకు తోడ్పడుతుందని మన పెద్దల విశ్వాసం.

మన బాహ్య నేత్రాలకి కనిపించని బ్రహ్మరంద్రం మన తలపై భాగంలో ఉంటుంది.ఈ భోగి పండ్లను పోయి ఆ బ్రహ్మ రంద్రాన్ని ప్రేరేపితం చేస్తే,పిల్లలలు జ్ఞానవంతులు అవుతారు. రేగుపండ్లు సూర్యకిరణాల లోని ప్రాణశక్తిని అధికంగా గ్రహించి,నిల్వ ఉంచుకుంటా యి.కనుక వీటిని తలమీద పోయడంవలన వీటిలోని విద్యుచ్చక్తి,శరీరంఫై,ఆరోగ్యం ఫై ప్రభావాన్ని చూపించి మంచి ఫలితాలు ఇస్తాయి. అందువల్లనే పిల్లలకి భోగి పండ్లు పోసి అశీర్వదిస్తారు.

మన ప్రతి సంప్రదాయం వెనుక అనేక అర్దాలు, అంతర్దాలు,రహస్యాలు ఉంటాయి.అవి తెలియక పోయినంత మాత్రం చేత ఆచార,సాంప్రదాయాలను ముఢనమ్మకలు అనుకోవడం మూర్ఖత్వం. వాటి విలువలను తెలుసుకొని చేసుకుంటే అవి మనకి మార్గదర్శకులు అవుతాయి.

Post a Comment

0 Comments