ఏపీలో ఒమిక్రాన్ ఉప వేరియంట్ అర్ట్యురుస్.
తొలుత జ్వరం, తర్వాత దగ్గు, జలుబు. రేపటి నుంచి వ్యాధి నిర్ధరణ పరీక్షల పెంపు.
● రాష్ట్రంలో ఒమిక్రాన్ ఉప వేరియంట్కు చెందిన ఎక్స్బీబీ.1.16 (అర్ట్యురుస్) కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
● గతంలో మాదిరిగా గొంతునొప్పి, ఒంటి నొప్పులు పెద్దగా లేవని వెల్లడించారు.
● ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నందున ఏపీలోనూ పరీక్షల సంఖ్య పెంచాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయి.
● రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం రోజుకు వెయ్యి పరీక్షలు కూడా జరగడంలేదు.
● ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని గత అనుభవాలు చెబుతున్నాయి.
● రాష్ట్రంలో కొవిడ్ ప్రభావంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి శనివారం సమీక్షించారు.
● ఈ నెల 10నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిత్యం 5,000 వరకు పరీక్షలు చేసేలా సన్నద్ధమయ్యారు.
● వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని అప్రమత్తం చేసేందుకు ఈ నెల 10, 11 తేదీల్లో జిల్లా కేంద్రాల్లో మాక్డ్రిల్ నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు వెళ్లాయి.
0 Comments