GET MORE DETAILS

పది పాసైతే తపాలా కొలువు

 పది పాసైతే తపాలా కొలువు



నియామక పరీక్ష రాయకుండా, పదో తరగతి| మార్కుల ప్రతిభతోనే ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది! గ్రామీణ డాక్ సేవక్ (జీడీ) ఎస్) ప్రకటన వెలువడింది. దేశవ్యాప్తంగా 1,828 పోస్టులు భర్తీ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 118, తెలంగాణలో 96 ఖాళీలు ఉన్నాయి. అవ కాశం వచ్చినవారు బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) హోదాలతో విధులు నిర్వర్తించ వచ్చు. పోస్టును బట్టి సుమారు రూ.15,000 నుంచి 20,000 వేతనం పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి!

గతంలో గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు ఎంపికైనవా రికి స్థిర వేతనం ఏటా ఇంక్రిమెంట్ మాత్రమే లభిం చేవి. ఈ ఏడాది ఏప్రిల్ 1 మంచి వీరికి మూలవేతనం (బేసిక్ పే)తో పాటు కరవు భత్యం (డియర్నెస్ అల వెన్సు)ను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చెల్లిస్తున్నారు. ప్రస్తుతం కేంద్రంలో 42 శాతం డి ఏ అమలువుతోంది.

దీని ప్రకారం బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం) కు 12,000 మూలవేతనంతోపాటు ఇందులో 12 శాతం అంటే రూ. 5040 డీఏ కూడా దక్కుతుంది. అంటే మొదటి నెల నుంచే వీరు రూ.17010 వేతనం అందుకో వచ్చు. దీంతోపాటు ఇతర ప్రోత్సాహకాలూ ఉంటాయి. ప్రతి ఆరు నెలలకు ఒక డిష్, ఏటా ఇంక్రిమెంట్ చేత నంలో కలుస్తుంది.

అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం) కు రూ. పదివేల మూల వేతనంతోపాటు రూ. 1200 4వ దక్కుతుంది. వీరు విధుల్లో చేరిన మొదటి నెల నుంచి రూ.14,200 వేతనం, ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చు. వీటితోపాటు ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంకు సంబంధించిన సేవలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ రూపంలో బీపీఎం ఏబీపీఎంలకు ప్రోత్సాహం అంది స్తారు. ఆ సేవల విలువ ప్రకారం ఇన్సెంటివ్ చెల్లి. వస్తారు. స్వల్పమొత్తంలో హెర్ ఆర్షి కూడా దక్కుతుంది. వీరు రోజువారి విధులు నిర్వర్తించడానికి ల్యాప్టాప్/ కంప్యూటర్/స్మార్ట్ఫోన్ లాంటివి పోస్టల్ శాఖ సమకూరు స్తుంది. సంబంధిత కార్యాలయానికి అందుబాటులో నివాసం ఉండాలి. సైకిల్ తొక్కడం రావాలి. ఈ పోస్టుల్లో అవకాశం వచ్చినవారు రోజుకు సుమారు. నాలుగైదు గంటలు పనిచేస్తే సరిపోతుంది.

విధులిలా...

బ్రాంచ్ పోస్టు మాస్టర్ (బీపీఎం):

వీరు బ్రాంచ్ కార్యక బాపాలు పర్యవేక్షించాలి. పోస్టల్ విధులతోపాటు ఇండియా పోస్టు పేమెంట్ బ్యాంకు వ్యవహారాదా చూసుకోవాలి. రికార్డుల నిర్వహణ, ఆన్లైన్ లావా దేవీలు, రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగేలా.. ఉత్తరాలు పంపిణీ జరిగేలా పర్యవేక్షించాలి. పోస్టలు సయింధించిన మార్కెటింగ్ వ్యవహారాలూ చక్కబెట్టాలి. బృంద నాయకుడిగా సంబంధిత బ్రాంచ్ ను నడిపించాలి.

పోస్టల్ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్ (ఏబీపీఎం): ఈ విధులు నిర్వర్తించేవారు స్టాంపులు/ స్టేషనరీ అమ్మకం.. ఉత్తరాలు పంపిణీ, ఇండియన్ పోస్టు నేమెంట్స్ బ్యాంకుకు సంబంధించిన డిపాజిట్లు, పేమెంట్లు, పోస్ట లక్కు సంబంధించిన ఇతర వ్యవహారాలు చక్కబెట్టాలి. బ్రాంచ్ పోస్టు మాస్టర్ చెప్పిన పనులు పూర్తిచేయాలి.. తపాలా స్కీమ్ గురించి ప్రజల్లో అవగాహన- కలిగించాలి.

ఎంపిక...

అభ్యర్థులు పదో తరగతిలో సాధించిన మార్కుల మెరిట్తో నియామకాలుంటాయి. ప్రకటనలో ఖాళీలు ఉన్న బ్రాంచీలు, ఏ హోదాలో ఖాళీ ఉంది, రిజర్వ్ డ్ అన్ రిజర్వ్డ్ మినరాలు పేర్కొన్నారు. వాటిని అభ్య దులు పరిశీలించి, తమ ప్రాధాన్యం ప్రకారం ఆప్షన్లు ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యం ఇస్తోన్నదానికి ఆప్షన్-1 తర్వాత దానికి ఆప్షన్-2 ఇలా నింపాలి. అవకాశాన్ని ఇట్టి వీటిలో ఏదో ఒకచోట పోస్టింగ్ కేటాయిస్తారు. కటాప్ అంచనా: గత నియామకాలు పరిశీలిస్తే.. ఏపీ, తెలంగాణల్లో జనరల్, ఓబీసీ విభాగాల్లో సుమారు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలైతే 80 శాతం మార్కులు పొందినవా రికి అవకాశం దక్కింది. పోస్టుల సంఖ్యను బట్టి కదా ప్లో హెచ్చుతగ్గులుంటాయి.

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. ఇందులో మ్యాథ్స్, ఇంగ్లిష్, స్థానిక భాష ఉండటం తప్పనిసరి. అంటే ఏపీ, తెలంగాణు చెందినవారు తెలుగు సబ్జెక్టు పదో తరగతి వరకు చదవాలి.

వయసు: జూన్ 11, 2020 నాటికి 18-10 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట సడలింపు వర్తిస్తుంది. 

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 11

వెబ్సైట్: https://indiapostgdsonline.gov.in


CLICK HERE FOR MORE DETAILS

Post a Comment

0 Comments