GET MORE DETAILS

భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం పాటుపడి ఉరి కంబం ఎక్కిన ఒక మరుగున పడిపోయిన స్వాతంత్ర సమరయోధుడి గురించి తెలుసుకుందాం

భారతదేశ స్వాతంత్ర పోరాటం కోసం పాటుపడి ఉరి కంబం ఎక్కిన ఒక మరుగున పడిపోయిన  స్వాతంత్ర సమరయోధుడి గురించి తెలుసుకుందాం



ఆయన పేరు సోహన్ లాల్ పతక్ , ఈయన అమృత్సర్ లో 7 జనవరి 1883 న ఒక నిరుపేద గుడి పూజారి అయిన చందా రాం కు ఏకైక సంతానంగా జన్మించారు . ఈయన తన చిన్నతనం నుండి అసాధారణ తెలివితేటలు , వాక్చాతుర్యం , నాయకత్వ లక్షణాలు ప్రదర్శించేవారు.  కాని ఆర్ధిక పరిస్థితులు  బాగుండకపోవడం చేత మధ్యలోనే చదువు ఆపివేశారు .ఆ తరువాత నీటి పారుదల శాఖలో క్లార్క్  గా చేరారు , కొ న్నాళ్ళు పనిచేశాక  తన చదువును కొనసాగించడానికి  తగిన డబ్బు సంపాదించాక  , ఉద్యోగాన్ని వదిలి లాహోర్లో చదువును కొనసాగించి  పూర్తిచేశాక ఉపాధ్యాయ వృత్తిలో  చేరారు. 

తన తండ్రి  చిన్నప్పటి నుండి నూరిపోసిన భారతదేశ  స్వాతంత్ర కాంక్ష తన మెదడులో నాటుకుపోయింది . లాహోర్ లో 1905-1907 మధ్య  స్వాతంత్ర సమరయోధుల పరిచయాలతో  మరికొంత  ఉత్తేజితుడయ్యాడు ,తన కుటుంబ ఆర్ధిక పరిస్థితిని లెక్కచేయకుండా తక్షణమే ఉద్యోగానికి రాజీనామా చేశాడు . వృద్దాప్యంలో ఉన్న తన తండ్రికి ఉత్తరం రాయగా , తండ్రి  సోహన్ లాల్  స్వాతంత్ర పోరాటం కోసం చేసిన త్యాగాన్ని అభినందిస్తూ  , తాము ఎలాగైనా బ్రతుకుతామని , తమ గురించి చింతించవద్దు అని. దేశం కోసం బ్రతకమని , భారతదేశాన్ని స్వతంత్ర దేశంగా ఏర్పడేలా ప్రయత్నం చేయమని జవాబు రాసాడు. తండ్రి నుండి వచ్చిన సమాధానంతో మరికొంత ప్రేరేపితుడైన సోహన్లాల్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేఖంగా తన వాక్చాతుర్యంతో అతి తక్కువ సమయంలోనే ప్రజలలో  చైతన్యం తీసుకురావడంలో సఫలమయ్యాడు  . ఆతరువాత  లాలా లజపత రాయ్  మొదలు పెట్టిన వందేమాతరం  అనే పత్రికకు ప్రధాన ఎడిటర్ గా సేవలు అందించాడు.

ఇదంతా గమనించిన  బ్రిటిష్ ప్రభుత్వం  ఆయన్ను అరెస్ట్ చేద్దామని ప్రయత్నించింది  . ఆయన లాహోరు  నుండి  బర్మా మకాం మార్చి  అక్కడ జనాలను బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా చైతన్యం చేయడం మొదలు పెట్టాడు  . ఆయన మీద ఉన్న ప్రజాదరణ కారణం గా బ్రిటిష్ వారు చేయి వేయడానికి  సాహసించేవారు కారు . ఆఖరున 1915 ఆగస్టు  నెల 7 వ తారీఖున మేమ్యే(బర్మా ) సమీపంలో అతి రహస్యంగా అరెస్ట్ చేసారు  . బ్రిటిష్ వారికి వ్యతిరేఖంగా పోరాడడం వలన  రాజ ద్రోహ ఆరోపణలపై  ఆయనకు ఉరిశిక్ష విధించారు  . ఆయనను 10 ఫిబ్రవరి 1916 న ఉదయం 7 గంటలకి మరొక స్వాతంత్ర సమరయోదుడైన హరిరాం సింగ్ సహారి తో ఉరి తీసారు .ఉరి తీసే సమయంలో వందేమాతరం  , రామ నామ్ సత్య హై అనే నినాదాలు చేస్తూ ప్రాణాలు వదిలారు .

Post a Comment

0 Comments