GET MORE DETAILS

చరిత్ర సృష్టించిన భారత్: Chadrayaan-3 : చంద్రయాన్‌-3 హీరోలు వీరే. కృషి చేసిన భారత్ శాస్త్ర వేత్తలకు అభినందనలు.

చరిత్ర సృష్టించిన భారత్: Chadrayaan-3 : చంద్రయాన్‌-3 హీరోలు వీరే. కృషి చేసిన భారత్ శాస్త్ర వేత్తలకు అభినందనలు.



చరిత్ర సృష్టించిన భారత్. 12 దేశాలు 141 ప్రయత్నాలు కాని సఫలమైంది భారత్ మాత్రమే. కృషి చేసిన భారత్ శాస్త్ర వేత్తలకు అభినందనలు.

జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే ఆ చారిత్రక క్షణాల కోసం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురు చూసిన మధుర క్షణాలు చంద్రుడిపై చంద్రయాన్-3 కాలు మోపింది.

లక్ష్యం దిశగా పైయనించిన చంద్రయాన్-3.. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై దిగింది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్‌ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత దగ్గరై, అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో సన్నద్ధమైంది. 41 రోజుల ప్రయాణం అనంతరం జాబిల్లి ఉపరితలంపై అడుగువేసేందుకు విక్రమ్‌ ల్యాండర్‌ రెడీ అయ్యింది. మరి, చారిత్రాత్మకమైన చంద్రయాన్‌-3 మిషన్‌ వెనకున్న శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన ముఖ్యమైన వ్యక్తులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం

ఇస్రో ఛైర్మన్‌ -ఎస్‌ సోమ్‌నాథ్‌ భారతి:

చంద్రయాన్‌-3ని ఆకాశంలోకి తీసుకెళ్లిన లాంచ్ వెహికల్‌ మార్క్‌-3ని రూపొందించడంలో కీలక పాత్రను పోషించారు ఇస్రో ఛైర్మన్‌ ఎస్‌ సోమ్‌నాథ్‌ భారతి. 

ఈయన 2022 జనవరి నెలలో ఇస్రోకు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రతిష్టాత్మకమైన చంద్రయాన్‌-3 మిషన్‎తోపాటుగా అతిత్వరలో ప్రారంభమయ్యే గగన్‌యాన్‌ మిషన్, సోలార్‌ మిషన్‌ ఆదిత్య-ఎల్‌1 పనులను ఈయనే దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. 

చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా:

 పీ వీరముత్తువేల్ 2019లో బాధ్యతలు తీసుకున్నారు. న్యూ రోవర్‌, ల్యాండర్‌ రూపకల్పన ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఐఐటీ మద్రాసు నుంచి టెక్నికల్ డిపార్ట్‎మెంట్‎లో పీహెచ్‌డీ పట్టా అందుకు వీరముత్తువేల్ చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్ డైరెక్టర్‌ వనితా ఆధ్వర్యంలోనూ పనిచేశారు. రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్స్, మంగళయాన్‌ మిషన్‌లో ఈయన కీలకమైన పాత్రను పోషించారు. 

చెన్నైలో బీటెక్‌ కంప్లీట్ అయిన తర్వాత ఇస్రోలో శాస్త్రవేత్తగా బాధ్యతు చేపట్టారు కల్పన . అంతకు ముందు శ్రీహరికోటలో 5 ఏళ్లు పనిచేశారు. 2005లో ట్రాన్స్‎ఫర్ మీద బెంగళూరులోని శాటిలైట్ సెంటర్లో బాధ్యతలు నిర్వహించారు. కల్పన సుమారు ఐదు ఉపగ్రహాల తయారీలో భాగమయ్యారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టులోనూ ఈమె పార్టిసిపేషన్ ఉంది. తాజాగా చంద్రయాన్‌-3 ప్రాజెక్ట్ అసోసియేటెడ్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 

కేరళలోని విక్రమ్‌ సారాభాయ్‌ స్పేస్‌ సెంటర్‌‎కు డైరెక్టర్‌గా ఉన్నారు ఉన్నికృష్ణన్‌ నాయర్‌. తాజాగా చంద్రయాన్‌-3 మిషన్ లో ని నింగిలోకి తీసుకెళ్లిన ఎల్‌ఎమ్‌వీ-3ని వీఎస్‌ఎస్‌సీలో నిర్మించారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్ట్ లోనూ ఉన్నికృష్ణన్ వీఎస్‌ఎస్‌సీలోని తన టీమ్‎తో కలిసి కీలక భూమిక పోషించారు.

యం.శంకరన్:

యూఆర్‌ రావ్ శాటిలైట్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా 2021లో ఎమ్‌ శంకరన్‌ వ్యవహరించారు. ఈయన దృష్టిలో ఇస్రో అంటే ఓ పవర్‌హౌస్‌ . శాటిలైట్స్ కు అవసరమైన పవర్‌ సిస్టమ్‌ను డెవలప్ చేయడంలో ఈయనకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. భారత దేశ అవసరాలకు అనుగుణంగా శాటిలైట్స్‎ను రూపొందించడం యూఆర్‌ఎస్‌సీ బాధ్యత. ఫిజికల్ సైన్స్‎లో గ్రాడ్యుయేట్ అయిన శంకరన్‌ చంద్రయాన్‌-3 మిషన్‌లో అత్యంత కీలకమైన ల్యాండర్‌ ఎనర్జీని ఎగ్జామిన్ చేసేందుకు అసవరమైన చంద్రుడి ఉపరితలాన్ని పోలిన నిర్మాణాన్ని భూమిపై తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. గతంలో శంకరన్ చంద్రయాన్‌-1, చంద్రయాన్‌-2 మిషన్లలోనూ భాగస్వామ్యులయ్యారు. 

తిరువనంతపురంలోని లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా వీ నారాయణన్ బాధ్యతలను వ్యవహరిస్తున్నారు. చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్ సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అవసరమైన థ్రస్టర్లను నారాయణన్ ఆధ్వర్యంలోనే డెవలప్ చేశారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌ పూర్వ విద్యార్థి అయిన నారాయణన్, క్రయోజెనిక్‌ ఇంజిన్స్‌ నిర్మాణంలో నిపుణులు. 

ఐఎస్‌టీఆర్‌ఏసీ డైరెక్టర్‌ -బీఎన్‌ రామకృష్ణ :

కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని ఇస్రో టెలిమెట్రీ ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్ నెట్‌వర్క్‌ సెంటర్‌ డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్నారు బీఎన్‌ రామకృష్ణ . చంద్రయాణ్ 3లో విక్రమ్‌ సాఫ్ట్ ల్యాండింగ్‌ ప్రక్రియలో '17 మినిట్స్‌ ఆఫ్‌ టెర్రర్‌'గా సైంటిస్టులు అభివర్ణిస్తున్న ప్రాసెస్‎ను ఈ సెంటర్ నుంచే పర్యవేక్షిస్తారు. ఎందుకంటే దేశంలోనే అత్యంత పెద్దదైన 32-మీటర్ల డిష్ యాంటేనా ఈ సెంటర్‎లోనే ఉంది. ఈ డిష్ యాంటేనా సాయంతోనే సైంటిస్టులు విక్రమ్‌ ల్యాండర్‌కు కమాండ్స్ పంపుతారు.

Post a Comment

0 Comments