GET MORE DETAILS

బి పి వస్తే ఏం చెయ్యాలి...? బి పి బిళ్ళలు రోజూ వాడాలా...?

 బి పి వస్తే ఏం చెయ్యాలి...? బి పి బిళ్ళలు రోజూ వాడాలా...?



బిపి వచ్చిన ప్రతిఒక్కరు క్రమం తప్పకుండా సంవత్సరాల తరబడి మందులు వాడుతూ ఉంటారు. అంతేకానీ మందుబిళ్ళలు రాసిచ్చిన వైద్యులు మనసును అదుపులో పెట్టుకొనే సాత్వికాహారం తినమనికానీ, అనారోగ్యాన్ని పూర్తిగా నిర్మూలించే ప్రాణాయామం, ధ్యానం, ఆసనాలవంటి యోగ ప్రక్రియలు ఆచరించమని కాని, పొరపాటున కూడా చెప్పరు. రోగులు కూడా వైద్యులను ఇంత చిన్న సమస్యకు జీవిత కాలమంతా మందులు వాడాలా? దీన్ని పూర్తిగా నిర్మూలించే మార్గం లేదా? అని అడుగనే అడుగరు.

రక్తపోటుకు కారణాలు:

ప్రొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రించే వరకు ఉరుకులు పరుగులతో సాగిపోతుంది.

రక్తపోటు రాకుండా ఉండాలంటే...?

తినవలసినవి:

• రోజూ విధిగా రెండుపూటలా ఆహారంలో ఒక పచ్చి ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఆ ముక్కలపై నిమ్మరసం పిండి కూరన్నంతో పాటు కలిపితినాలి. రోజూ రాత్రిపూట ఒక దానిమ్మ పండు తినాలి.

• రోజూ ఉదయం పరగడుపున ఒక టేబుల్ స్పూన్ బార్లీగింజలు ఉడికించగా వచ్చిన నీరు ఒకటి రెండు గ్లాసులు తాగాలి.

• ఉదయకాల భోజనంలో జొన్నరొట్టెలు లేదా రాగిరొట్టెలు ఉడికించిన కూరలతో తినాలి.

• మధ్యాహ్న భోజనంలో కూరగాయల రసాలు ఒక గ్లాసు లేదా పలుచని తీయ్యటి మజ్జిగ లేదా పండ్లరసాలు తాగాలి.

• రోజూ సాయంత్రం కొత్తిమీర, కరివేపాకు, పుదీన, ఇరవై ఆకుల చొప్పున మరియు పదితులసి ఆకులు కలిపి దంచి రసం తీసి అందులో ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి తాగాలి.

• రాత్రి భోజనంలో పచ్చికూరలు (క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, ఖీరా దోసకాయ మొదలగునవి) తినాలి.

• ఉప్పుకు బదులుగా సైంధవలవణము వాడాలి.

• మిరపకాయల కారానికి బదులుగా మిరియాలకారం వాడటం శ్రేష్ఠం.

• పాతచింతపండు మాత్రమే వాడాలి.

తినకూడనివి:

 మాంసం, చేపలు, గుడ్లు, అతికారం, అతిఉప్పు, అతిపులుపు, అతివేడి చేసే పదార్ధాలు, పెరుగు, ఉడికీ ఉడకని, చల్లబడిన ఆహారపదార్ధాలు, కొవ్వు పదార్ధాలు, అతితీపి పదార్ధాలు, పంచదారతో చేసిన పదార్ధాలు వద్దు లాభముండదు. అన్నం బదులుగా రొట్టెలు లేదా మూడు, నాలుగు రకాల ధాన్యాన్ని కలిపి తింటూ వుంటే మంచిది.

రక్త పోటునుసమర్థవంతంగా తగ్గించే ఇంట్లో ఉండేఔషదాలు:

పెద్దవారిలో సాధారణ రక్తపీడన రీడింగు 120/70 to 140/90 ఉండాలి. ఎవరైనా రక్త పీడన స్థాయిలు140/90 కన్నా ఎక్కువగా ఉంటే దానిని అధిక రక్త పీడనస్థాయిలు లేదా హైబ్లడ్ ప్రెషర్ గా పేర్కొంటారు. వైద్య శాస్త్రప్రకారం ఇది చాలా తీవ్ర పరిణామాలకు గురి చేసే స్థితిగా తెలుపవచ్చు. దీనికి తగిన చికిత్సలు అందించటంతప్పని సరి.

అధిక రక్త పీడన స్థాయిల వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి, ఉదాహరణకు– గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, మెదడు మరియు కళ్ళలో ప్రమాదాలు వంటి ముఖ్య అవయవాలు ప్రభావానికి గురవుతాయి. శుభవార్త ఏమిటంటే, ఈ ప్రమాదకరమైన వ్యాధిని సహజ ఔషదాల ద్వారా సమర్థవంతంగా తగ్గించవచ్చు. మొదటగా, అధిక రక్త పీడనాన్ని కలుగచేసే సాధారణ కారణాలు, కారకాల గురించి తెలుసుకుందాం.

అధిక రక్త పీడనాన్ని కలుగచేసే సాధారణ కారణాలగురించి కింద  పేర్కొనబడింది

◾స్థూల కాయత్వం లేదా ఊబకాయం

◾అధిక మొత్తంలో ఆల్కహాల్ సేవించడం

◾అనారోగ్యకర జీవనశైలి

◾నొప్పి నివారణ మందుల వాడకం

◾థైరాయిడ్ సమస్యలు

◾మూత్రపిండ సంబంధిత సమస్యలు

అధిక రక్త పీడనాన్ని తగ్గించే సహజ ఔషదాలు

వెల్లుల్లి మరియు లవంగాలు:

వెల్లుల్లి రక్త పీడనాన్ని తగ్గించే శక్తివంతమైన ఇంట్లో ఉండే ఔషదంగా చెప్పవచ్చు. రోజు ఉదయాన లవంగాలు మరియు వెల్లుల్లిని కలిపి నమలండి మరియు నీటితోనీటిని కడుక్కోండి. ఈ పద్దతిని రోజు అనుసరించటంవలన మంచి ఫలితాలు పొందుతారు.

విత్తనాల ఔషదం:

100 గ్రాముల గసగసాలు మరియు ఎండబెట్టినపుచ్చపండు విత్తనాలను తీసుకొని, వాటిని కలపండి. ఈమిశ్రమాన్ని శుభ్రంగా కడిగిన ఒక ఖాళీ గాజు పాత్రలోభద్రపరచండి. ఈ మిశ్రమానికి రోజు ఉదయాన, సాయంత్రం రెండు సార్లు ఒక చెంచా నీటిని కలపండి. ఈమిశ్రమం వాడకం వలన మంచి ఫలితాలనుపొందుతారు.

కరివేపాకు ఆకులు:

25 నుండి 30 కరివేపాకు ఆకులను తీసుకొని, రసాన్నితీయండి. ఈ రసాన్ని అలాగే కొద్ది సమయం వరకుఉంచి, ఉదయాన లేవగానే తాగండి.అంతే కాకుండా, ఈమిశ్రమానికి  నిమ్మరసాన్ని కలిపి కూడా తాగవచ్చు.

నిమ్మ మరియు తులసి ఆకులు:

ఇంట్లో ఉండే సహజ ఔషదాలతో రక్త పీడనాన్ని తగ్గించుకోవాలి అనుకుంటున్నారా! అయితే 4 తులసి ఆకులను మరియు 2 నిమ్మ ఆకులను 2 నుండి 4 చెంచాల నీటిలో కలపండి. ఈ మిశ్రమాన్ని వారానికి ఒకసారైన ఖాళీ కడుపు లేదా పడుగడుపున తీసుకోవటం వలన రక్త పీడన స్థాయిలు శక్తివంతంగా తగ్గించబడుతుంది.

ఉల్లి మరియు తేనె:

ఉల్లిపాయ నుండి రసాన్ని తయారు చేసి దీనికి సమాన పోట్టంలో తేనెను  కలపండి. ఈ శక్తివంతమైన మిశ్రమాన్ని రోజు రెండు చెంచాలు తాగండి. అధిక రక్త పీడనాన్ని తగ్గించే మరొక శక్తివంతమైన ఔషదంగా దీనినిపేర్కొనవచ్చు.

కొబ్బరి నీరుకొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలున్నాయి వీటిలో అధిక రక్త పీడనం కూడాఒకటి. కొబ్బరినీరు తాగటం వలన అధిక రక్త పీడనస్థాయిలు గణనీయంగా తగ్గుతాయని అధ్యయనాలలో వెల్లడించబడింది. ఈ రుచికరమైన ద్రావనాలు మూడ్ నుమార్చటమే కాకుండా, ఇతర చక్కెర ద్రావణాల వలేపొట్టలో నొప్పిని గానీ, తిమ్మిరులను కలుగచేయవు.

అధిక రక్త పీడనానికి గురవకుండా ఉండటానికి, ఈఔషదాల వాడకంతో పాటూ, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరిస్తూ, వ్యాయామాలను, ఆల్కహాల్ తక్కువగా తీసుకుంటూ, పొగ వంటి దురలవాట్లకు దూరంగా ఉండండి.

Post a Comment

0 Comments