GET MORE DETAILS

నేడు జాతీయ బాలిక దినోత్సవం.

నేడు జాతీయ బాలిక దినోత్సవం.



జాతీయ బాలికా దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న నిర్వహించ బడుతుంది. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ఈ బాలికా దినోత్సవం రోజున అవగాహన కల్పిస్తారు. బాలికలపట్ల వివక్ష, అసమానత, చిన్నచూపు, లైంగిక వేదింపులు, అత్యాచారాల నుండి రక్షించడానికి కుటుంబం, మిత్రులు, సమాజం సన్నద్ధం కావాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. పుట్టిన తరువాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు. వాటిని నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించే దిశగా భారత ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్మెంట్ మిషన్‘ పేరుతో ఒక కార్యక్రమం రూపొందించింది. అందులో భాగంగా 2008లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంతో జాతీయ బాలికా దినోత్సవంను ప్రారంభించడం జరిగింది.

సమాజంలో బాలికలు ఎదుర్కొన్న సమస్యలు గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి జరుపు కుంటారు. బాలిక శిశువు గురించి అసమానత్వం, విద్య, పోషణ, చట్టపరమైన హక్కులు, వైద్య సంరక్షణ, రక్షణ, గౌరవం, బాల్య వివాహంల గురించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.

బాలికల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ‘నేషనల్ గర్ల్స్ డెవలప్‌మెంట్ మిషన్‘ పేరుతో ఓ కార్యక్రమం తెచ్చింది. బాలికల సంపూర్ణ ఎదుగుదల కోసం రకరకాల సదుపాయాలు కల్పిస్తోంది. వాటిలో భాగమే జాతీయ బాలికా దినోత్సవం. 2008 నుంచీ దీన్ని ఏటా నిర్వహిస్తోంది. సమాజంలో బాలికల సంరక్షణ, వాళ్ల హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల అంశాలపై ఈ రోజున అవగాహన కల్పిస్తోంది. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక… “బేటీ బచావో బేటీ పడావో” స్కీం తెచ్చారు. తద్వారా బాలికల చదువు, పెంపకంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకునేలా చేస్తున్నారు.

సమాజంలో మహిళల హోదాను ప్రోత్సహించటానికి జరుపు కుంటారు. బాలికలు సాధారణంగా వారి జీవితంలో ఎదుర్కొనే వివిధ రకాల సాంఘిక వివక్ష, లైంగిక దోపిడీని నివారించడం అత్యవసరం. సమాజంలో మహిళల ప్రాదాన్యత, భాగస్వామ్యం గురించి అవగాహన పెంచడానికి, ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు, వివిధ రాజకీయ, సామాజిక, స్వచ్ఛంద సంస్థలు బాధ్యులు, సమాన విద్య, ప్రాథమిక స్వేచ్ఛ కోసం వివిధ కార్యక్రమాల ద్వారా వివరించడం జరుగుతుంది.

బాలికల కంటే అబ్బాయిలకే ఎక్కువ ప్రాధాన్యత అధికంగా ఇవ్వడం సర్వత్రా వ్యక్తమవు తున్నది. ఇటీవల కాలంలో ఆడపిల్లగా పుట్టడం, పుట్టినా సురక్షితంగా మనుగడ సాగించడమే దుర్భరమైన దురవస్థ ఉంది.

చైనా మొదలు అమెరికాతో సహా ఆధునికత వైపు అడుగులు వేస్తున్న భారత్‌లోనూ అమ్మాయిలపట్ల వివక్ష ఉంటుందని గ్లోబల్ ఎర్లీ అడల్సెంట్ స్టడీ పేరిట నిర్వహించిన ఒక అధ్యయనంలో భాగంగా… అమ్మాయిలు పదహారేళ్ల వయసుకు చేరుకున్నప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తేలింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, జాన్‌హఫ్‌కిన్స్ బ్లూమ్ బెర్గ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కిడ్స్ సంయుక్తంగా 15 దేశాల్లో నిర్వహించిన సర్వేలో అమ్మాయిలు శారీరకంగా బలహీనులనే విషయం… చిన్న వయసులోనే ముద్ర పడేలా చేయడంలో తల్లిదండ్రులు, బంధువులు, మిత్రులు, టీచర్లు కీలకపాత్ర పోషిస్తున్నట్టు తేలింది.

చిన్నారులపై లైంగిక వేధింపులు

నేడు మహిళా సంఘాలు, ప్రభుత్వ యంత్రాంగం నిత్యం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా మైనర్లపై అత్యాచారాలు ఆగడంలేదు. సమాజంలో అమ్మాయిలు, మహిళలకు రక్షణ కరువ వుతున్నది. ఎంతోమంది ఆడ పిల్లలు ఈ లోకంలో అడుగుపెట్టక ముందే బలవంతపు మరణాలకు బలవు తున్నారు. ఆధునిక పరిజ్ఞానం ఎంత పెరిగినా మానవతా విలువలు మాత్రం పెరగడం లేదు. దానికి నిదర్శనం భ్రూణ హత్యలు. గర్భస్త శిశువుల లింగ నిర్ధారణను నిషేధించి తద్వారా ఆడపిల్లల భ్రూణ హత్యలు నివారణ కోసం 1994లోనే చట్టం తెచ్చినా అది ఏనాడూ పకడ్బందీగా అమలైన జాడలు లేవు.

దేశంలో నానాటికీ అడపిల్లల సంఖ్య తగ్గిపోతూ, కొనసాగితే చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందనేది కాదన లేని వాస్తవం. ఇదే కాక ప్రపంచంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 40% పైగా భారతదేశం లోనే జరుగుతున్నాయని ఇటీవలే యూనిసెఫ్ గణాంకాలను వెల్లడించింది. బాలికల ఉన్నత విద్య మరో సమస్యగా మారింది, ఇప్పటికి అధిక రాష్ట్రాల్లో 40%నికి పైగా పదో తరగతి కంటే ముందే బడి మాని వేస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా, ఉన్నత విద్యలో డ్రాపౌట్స్ తగ్గడంలేదు. బాల్య వివాహం కారణంగా రాష్ట్రంలోని 28 శాతం మంది బాలికలకు పద్దెనిమిది సంవత్సరంలోపే వివాహాలు చేస్తున్నారు. యునెస్కో వెలువరించిన ప్రపంచ విద్య నివేదిక ప్రకారం భారత దేశంలో వయోజన నిరక్షరాస్యులలో మహిళలు 68 శాతం వున్నారు. పంతొమ్మిది ఏళ్లు నిండక ముందే దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నారు. బాలికల సంఖ్య 41 శాతం అని జనగణనలో తేలింది. బాల్య వివాహాలు, పాఠశాలలు చేరువ, అందుబాటులో పూర్తి స్థాయిలో లేకపోవడం, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్ల కొరత, లైంగిక విచక్షణ వంటి సమస్యలు భారతావనిలో బాలిక విద్యకు శాపంగా పరిణ మించింది. పోషకాహార లోపం కారణంగా రక్తహీనతతో బాధపడుతున్న బాలికల సంఖ్య దేశంలో దాదాపు డెబ్బై శాతం అన్న అంచనాలు తీవ్రంగా కలవర పరుస్తున్నాయి. మహిళా కార్మిక శక్తి, వారి ఆదాయం, అక్షరాస్యాత స్థాయి, జననాల విషయం, తదితర అంశాల్లో అధమస్థాయిలో వున్న 20 దేశాల్లో మన దేశం ఒకటి కావడం ఆందోళనకర అంశం. మహిళలు పురుషులకన్నా ఎందులోనూ తక్కువ కాదు. ఆడపిల్లలు ప్రతి రంగంలో, చదువులో మొదలుకుని ఆటల దాకా, రాణిస్తున్నారు. పురుషులతో పోటీ పడుతున్నారు.

బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలియ చేయడమే కాకుండా, ఆ సమస్యలు పరిష్కరించ బడినప్పుడు జరిగే పరిణామాల గురించి కూడా అవగాహన పెంచడానికి ఈ దినోత్సవం ఉపయోగ పడుతున్నది. ఆడపిల్లలకి తప్పనిసరి అవసరమైన భద్రత, సాంకేతిక విజ్ఞానాన్ని సేవల్ని అందుబాటులో వుంచాలి.

బాలికలను విద్యావంతులను చేసి, బాల్య వివాహాలు తగ్గించడంలో, విద్యను అభ్యసించిన బాలికలు అధిక వేతనాలతో ఉద్యోగాలు పొందడంలో మార్గదర్శకంగా నిలవడం ద్వారా మహిళత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి కూడా సహాయ పడు తున్నది. ప్రపంచ వ్యాప్తంగా బాల్య వివాహాల్లో నలభై శాతంకి పైగా భారత్‌లోనే జరుగుతున్నాయన్న చేదు నిజాన్ని యునిసెఫ్ స్పష్టం చేసింది.

సమాజంలో చైతన్యం నింపాలంటే ముందు మహిళ జాగృతం కావాలి. స్త్రీ కళ్లు తెరిస్తే కుటుంబం, దానితో పాటు గ్రామం, రాష్ట్రం, దేశం పురోగతి బాట పడతాయి’ అని భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ గతంలో చేసిన వ్యాఖ్యలు గుర్తుంచు కోవాలి. కౌమారదశలో ఆడపిల్లలు, యువతులు ఎదుర్కొనే వివిధ రకాల హింసను అంతం చేయాలి.

బాలికలు వారి చట్టపరమైన హక్కులు మరియు జీవిత వాస్తవాలను గురించి తెలుసు కోవాలి. వారు మంచి విద్య, పోషణ, ఆరోగ్య సంరక్షణ హక్కులను కలిగి ఉంటారని అవగాహన కల్పించాలి. గృహ హింస చట్టం 2009, చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 నిషేధించడం మరియు కట్న నిషేధ చట్టం 2006 వంటి చట్టాల గురించి వారి సరైన హక్కులు పొందడానికి మరియు జీవితంలో అన్ని సవాళ్లను ఎదురుకొని ముందుకు వెళ్ళాలి.                                                                           

Post a Comment

0 Comments