విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీనా మీడియా సమావేశం వివరాలు
• రాష్ట్రంలో 144 సెక్షన్ అమలవుతోంది.
• ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే.
• సువిధ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవాలి.
• ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం.
• వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.
• 46 మందిపై చర్యలు తీసుకున్నాం.
• కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం.
• ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం .
• ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు.
• ఎప్పటికప్పుడు ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది
• సీ విజిల్ యాప్లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం .
• సీ విజిల్ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు.
• ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్లు తొలగించాం.
• 385 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాం .
• 3 రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నాం.
• ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయి .
• డీఎస్సీపై విద్యాశాఖ వివరణ కోరాం .
• డీఎస్సీ నిర్వహణపై సీఈసీకి లేఖ రాస్తాం.
• ఉస్తాద్ భగత్సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు. టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే.
• రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం.
• హింస రహిత, రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
• గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి.
• ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతాం. ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు.
- సీఈవో ముఖేశ్కుమార్ మీనా
0 Comments