GET MORE DETAILS

విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా మీడియా సమావేశం వివరాలు

 విజయవాడ: ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్‌కుమార్‌ మీనా మీడియా సమావేశం వివరాలు 



• రాష్ట్రంలో 144 సెక్షన్‌ అమలవుతోంది.

• ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందే.

• సువిధ యాప్‌ ద్వారా అనుమతులు తీసుకోవాలి.

• ఇప్పటి వరకు 392 దరఖాస్తులు పరిష్కరించాం.

 • వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చాయి.

• 46 మందిపై చర్యలు తీసుకున్నాం.

• కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించాం.

• ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించాం .

• ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాప్రతినిధులతో కలిసి తిరగకూడదు.

• ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుంది 

• సీ విజిల్‌ యాప్‌లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నాం .

• సీ విజిల్‌ ద్వారా ఎవరైనా ఫొటో, వీడియో తీసి పంపవచ్చు.

 • ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు తొలగించాం.

• 385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశాం .

• 3 రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నాం.

• ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయి .

• డీఎస్సీపై విద్యాశాఖ వివరణ కోరాం .

• డీఎస్సీ నిర్వహణపై సీఈసీకి లేఖ రాస్తాం.

• ఉస్తాద్ భగత్‍సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదు. టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే.

• రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే మా లక్ష్యం.

• హింస రహిత, రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నాం.

 • గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయి.

 • ప్రకాశం, నంద్యాల, పల్నాడు ఎస్పీలతో మాట్లాడుతాం. ఎస్పీల వివరణతో పాటు నివేదిక చూశాక చర్యలు.


 - సీఈవో ముఖేశ్‌కుమార్‌ మీనా

Post a Comment

0 Comments