GET MORE DETAILS

వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం - డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల దినోత్సవము

వినియోగదారుల చట్టాలపై ప్రజల్లో విస్తృత అవగాహన అవసరం - డిసెంబర్ 24 న జాతీయ వినియోగదారుల దినోత్సవము



డోన్ పట్టణంలోని న్యాయస్థాన ప్రాంగణము నందు  వినియోగదారుల సంక్షేమ సంస్థ అధ్యక్షుడు ఎస్. రామకృష్ణారెడ్డి, సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యంలో  బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గౌడ్  అధ్యక్షతన  విశిష్ట అతిథి గా మొదటి శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి జ్యోతి గారు విచ్చెసి ప్రపంచ వినియోగదారుల దినోత్సవం ఘణంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా  మొదటి శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి జ్యోతి గారు మాట్లాడుతూ అక్రమ వ్యాపార పద్ధతులకు వ్యతిరేకంగా వినియోగదారులను రక్షించే హక్కు వినియోగదారుల రక్షణ చట్టాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగదారుడే. వస్తువు కొనుగోలులో వినియోగదారుడు నష్టపోతే సంబంధిత బిల్లుతో కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. ఇలాంటి వినియోగదారుల హక్కులను గురించి అనేక విషయాలు తెలియజేశారు.అలాగే వినియోగదారుల సంక్షేమ సంస్థ అధ్యక్షులు ఎస్.రామకృష్ణారెడ్డి, సామాజిక కార్యకర్త డోన్ పి.మహమ్మద్ రఫి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాల్ గౌడ్  మాట్లాడుతూ వ్యాపారస్తులు కల్తీ ఆహార పదార్థాలను విక్రయించకుండా ఉండాలని వినియోగదారుడే వ్యాపార అభివృద్ధికి పునాది అని ప్రపంచవ్యాప్తంగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ, హక్కులకు విఘాతం కలిగించే అనైతిక అవినీతిపరులను కట్టడి చేయడం లాంటి అంశాలు ప్రజల్లో నిరంతర అవగాహణ  అవసరమని వారు తెలియజేశారు.

అలాగే  మొదటి శ్రేణి న్యాయమూర్తి శ్రీమతి జ్యోతి గారి చేతుల మీదుగా వినియోగదారులను  చైతన్య పరిచే కరపత్రాలను విడుదల చేశారు.  అనంతరం సమగ్ర వియోగదారుల సంక్షేమ సంస్ద అద్యక్షులు యస్. రామకృష్ణారెడ్డి, సామాజిక కార్యకర్తలు పి. మహమ్మద్ రఫి  ఆధ్వర్యంలో శ్రీ సుధా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్

థెరిసా ఎలిజిబిత్ గారి అధ్యక్షతన  ఏర్పాటు చేసిన సమావేశంలో హై స్కూల్  విధ్యార్థులకు  వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించి కరపత్రాలను  పంపిణీ చేశారు. పట్టణంలోని పలు ప్రాంతాలలో  పంపిణీ చేసి వినియోగదారుల చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఐఎ యల్ రాష్ట్ర కార్యదర్శి ఆర్.రాముడు, సీనియర్ న్యాయవాదులు నారాయణ, శివరామకృష్ణ, మద్దిలేటి, రవి, ఎం. కుమారి, న్యాయవాదులు,  హై స్కూల్ ఉపాధ్యాయులు రంగస్వామి, సర్దార్, ఫరీదా, లీలావతి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments