GET MORE DETAILS

అరికాళ్ళకు నూనె రుద్దండి కళ్ళను కాపాడుకోండి - నేత్రసంరక్షణకు ఆయుర్వేదం ఏం చెప్పింది ?

అరికాళ్ళకు నూనె రుద్దండి కళ్ళను కాపాడుకోండి - నేత్రసంరక్షణకు ఆయుర్వేదం ఏం చెప్పింది ?



ఆయుర్వేద మహర్షులు ప్రకృతిని పరిశోధించి ఆహారపదార్థాలను కూడా పరిశీలించి నేత్ర సంరక్షణ కోసం కొన్ని సులువైన సూచనలు మానవాళికందించారు.

వాగ్భటగ్రంథంలో ప్రఖ్యాతవైద్యశాస్త్రవేత్త శ్రీమాన్ వాగ్భటాచార్యులవారు నిండునూరేళ్ళవరకూ నేత్రదృష్టి దెబ్బతినకుండా ఉండాలంటే, స్త్రీ పురు షులు ప్రతిరోజూ నిద్రించేముందు పాదాలకు నువ్వులనూనె మర్దన చేయాలని పగతిపూట వీలు న్నప్పుడల్లా చన్నీటితో పాదాలను పరిశుభ్రంగా కడు గుతూ ఉండాలని ఎల్లవేళలా తోలుచెప్పులను ధరిం చాలని సూచించారు.

అంతేగాక స్త్రీలకోసం ప్రత్యేకంగా అభ్యంజన విధానం బోధించారు. అభ్యంజనం అంటే కళ్ళకు కాటుక పెట్టుకోవడం. మనదేశంలో స్త్రీలు మాత్రమే కళ్ళకు కాటుక పెట్టుకునే ఆచారం అమల్లో ఉండేది. ఈ పద్ధతులను గురించి వివరంగా తెలుసుకుందాం.

కాళ్ళకు నూనెరాస్తే - కళ్ళెలా బాగుపడతాయి ?

శరీరంలో పైనవుండే శిరోభాగంలో కళ్ళు అమర్చబడివున్నాయి . అధోభాగం కాళ్ళున్నాయి. మరి కాళ్ళకు నూనెరాస్తే కళ్ళు ఏ విధంగా బాగుపడతాయి అని సందేహం వారు చాలామంది ఉంటారు.

శరీరంలోని అన్ని అవయవాల మొదళ్ళు అరికాళ్ళలోను అరిచేతులలోను అపరచు ఉన్నాయి. అందువల్ల అన్నిరకాల నూనెల్లో మేలైన నువ్వులనూనెను అరికాళ్ళకు ప్రతిలోవా నిద్రించేముందు మర్ధన చేయడంవల్ల ఆ నూనె అరికాళ్ళలోని నరాలద్వారా లోప ప్రవేశించి కేవలం కండ్లను మాత్రమేకాక మిగిలిన అన్ని అవయవాలను కూడా ఆరో వంతంగా మారుస్తుంది.

అయితే మన కుటుంబాలలోని ఒక అనుభవాన్ని తెలుసుకుందాం. తరతరాలు మన ఇండ్లలోని వయోవృద్ధులు బయటకువెళ్ళి ఇంటికి వచ్చిన తరువాత కాళ్ళు ల తున్నాయని పాదాలకు నూనెరాయమని అడగడం. భార్యచేత లేదా బిడ్డలచేత ప తనకు తానే గోరువెచ్చని నువ్వులనూనెను తనపాదాలకు ఇంకిపోయేవరకు రుద్దు కొద్దిసేపు విశ్రాంతి తీసుకోగానే ఆనందంగా కాళ్ళనొప్పులు తగ్గిపోయాయని శరీరము తేలికగా శిరస్సంతా నిర్మలంగా హాయిగా ఉందని చెప్పడం మనకు తెలుసు.

ఈ అనుభవాన్ని ఈనాటి ఆధునికులు కూడా స్వయంగా ఆచరించి ఇది నిజమాడు కొలతకాలంపాటు విధిగా ఆచరించడంవల్ల కంటిచూపు మెరుగుపడిందని స్వామభుగా తెలుసుకోవచ్చు.

ఇంకా ఆలస్యం ఎందుకు? నేటినుండి ప్రతిఒక్కరు తమ పాదాలకు మువ్వురు మర్జించడం మొదలు పెట్టండి.

కాళ్ళుకడిగితే - కళ్ళకు మేలా...?

అవును ఇది ముమ్మాటికీ సత్యం. ఇది తిరుగులేనిది. బయట ఎక్కడెక్కడో తిరిగి అనేకవిధాలుగా చీరకంగా మానసికంగా అలసిపోయి ఇంటికిరాగానే నాలుగైదు చెంబుల నీళ్ళు కాళ్ళమీద పోసుకొని డిగిన మరుక్షణంలోనే అంతకుముందున్న అలసట, చిరాకు అదృశ్యమైపోయి మనసు శరీరం ప్రశాంత పొందుతాయ్. తలకెక్కిన అధిక పైత్యం అదుపులోకి వచ్చి నేత్రదృష్టికి హానికలుగకుండా కాపాడ డుతుంది.

అందుకే పూర్వకాలంనుండి ఈ ఆరోగ్యవిధానాన్ని ఒక ఆచారంగా మార్చి బయటనుండి ఇంటిక రాగానే తప్పకుండా కాళ్ళు కడిగిన తరువాతే లోపలికిరావాలని నియమం విధించబడింది. ఈ నియమం మరి కాళ్ళకు తదితరఅవయవాలకు మేలు జరగటమేకాక వీధుల్లో తిరిగినప్పుడు పాదాలకు అంటుకునే లేకరకాల వ్యాధికారకక్రిములు కూడా తొలగిపోతయ్.

అయితే, ఈనాటి ఆధునికులు ఈ మంచి ఆచారాన్ని మరిచిపోయి కాళ్ళుకడగటం మానేశారు. అంతే మైని చేసేటప్పుడుకూడా కాళ్ళను పరిశుభ్రంగా రుద్దుకోవటం విడిచిపెట్టారు. ఇప్పటికైనా ఇందు అశరార్థం తెలుసుకొని ప్రజలంతా ఈ ఆచారాన్ని పాటించి ఆరోగ్యాన్ని పొందవలసిందిగా సూచిస్తన్నాం.

కాళ్ళకు చెప్పులువేసుకుంటే - కళ్ళకు మంచిదా...?

ఎన్నోతరాల ప్రజల అనుభవసారంగా ఎన్నెన్నో ప్రయోగాల ఫలితాంశంగా ఈ ఆచారం మనదేశంలో స్థిరపడింది. తోలుతో తయారుచేసిన చెప్పులను తొడుక్కొని నడవడంవల్ల పాదాలకు మాటిమాటికి ఒత్తిడి కలుగుతుంది. దానివల్ల పాదాలలో ఉండే వివిధ అవయవాల మొదళ్ళు చైతన్యవంతమై కంటిచూపు దెబ్బతినకుండా ఇతర అవయవాలకు కూడా మేలుజరుగుతుంది.

అయితే, ఈనాడు చాలామంది రబ్బరు, ప్లాస్టిక్ మొదలైన వ్యర్థపదార్థాలతో తయారుచేసిన చెప్పులను వాడుతూ తమ కళ్ళకు జరగవలసిన మేలుకు తామే ఆటంకం కలిగించుకుంటున్నారు. అందువల్ల ఇప్పటికైనా మన అభిమానులంతా తోలు చెప్పులను మాత్రమే వాడుకోవాలని సూచిస్తున్నాం.

పురుషులెందుకు కాటుక పెట్టుకోకూడదు...?

ఎండలో అధికమైన శ్రమచేసేవారు, ఉదరంలో ఊదా వర్ధo అనబడే వ్యాధిగలవారు, తరచుగా దుఃఖంతో కుమిలే వారు రోజూ మద్యపానం సేవించేవారు, ఎల్లవేళలా కోపము భయం లేదా జ్వరం వచ్చేవారు, అధికంగా ఎండలో తిరిగే వారు, శిరస్సులో ఏదోఒక సమస్యతో పీడింపబడేవారు కా టు క ధరించరాదని మిగిలినవారంతా అనగా ముఖ్యంగా స్త్రీ కాటుకను ధరించవచ్చని నిర్ధారించారు.

ఆముదంతో- ఆవునెయ్యితో - అతిచల్లాగా ఉండే - అద్భుత కాటుక:

కావలసినపదార్థాలు:

దేశవాళీ ఆవునెయ్యి, వంటాముదం, ఆవుపిడకలు, రాగిపళ్ళెం, మట్టిమూకుడు సేకరించుకోవాలి.

తయారీ విధానం:

ముందుగా ఆవునెయ్యి, వంటాముదం సమభాగాలుగా తీసుకొని ఒకమట్టిపాత్రలో పోసి సిద్ధంగా వుంచుకోవాలి. తరువాత ఆవుపీడకను శుభ్రమైన రాతిమీదపెట్టి నిప్పు అంటించి కాల్చి ఆరబెడితే అది బొగ్గులాగా లేక కచ్చికలాగా అవుతుంది. అది చల్లారిన తరువాత దానిని పైన తయారైన ఆవునెయ్యి వంటాముదం కలిపిన మూకుడులో పెట్టాలి కొంతసేపటికి ఆ కచ్చిక కొంత ఆవునెయ్యిని కొంత వంటా ముదాన్ని పీల్చుకుంటుంది.

ఆ తరువాత ఆ కచ్చికను తీసి గాలిలేని గదిలో ఒకపళ్ళెంలో పెట్టి దానిచుట్టూ మూడు ఇటుకరాళ్ళు నిలబెట్టి ఆ రాళ్ళపైన శుభ్రమైన రాగిపళ్ళాన్ని బోర్లించి కచ్చికను వెలిగించాలి. కచ్చికమంట రాగి పళ్ళేనికి తగిలేలా అమర్చాలి కచ్చికలో నెయ్యి, ఆముదం ఉన్నంతవరకు అది మండుతుంది. ఆ మంట రాగిపళ్లెనికి మసిలాగా అంటుకుంటుంది. పాత్ర చల్లారిన పళ్లాన్ని తీసి అందులో నాటు ఆవునెయ్యి కొన్ని చుక్కలు మరియు ఒకటి లేదా రెండు గ్రాముల స్వచ్ఛమైన భీమసేనీకర్పూరం(పచ్చ కర్పూరం) పొడివేసి కలిపితే బొటానవ్రేలుతో కలిపితే కాటుక తయారవుతుంది. ఈ కాటుకను జాగ్రత్తగా భరిణలో భద్రపరుచుకోవాలి

వాడే విధానం:

ఈ కాటుకను పైన చెప్పిన విధంగా తయారు చేసుకోగలిగితే, పిల్లలు పెద్దలు అందరూ వాడుకోవచ్చు. దీనిని కళ్ళకు కాటుకపెట్టినట్లుగా ప్రతిరోజూ ఉపయోగిస్తుంటే, కళ్ళకు అమితమైన చల్లదనం కలిగి, కళ్ళు నిర్మలంగా కలువరేకుల్లా మనోహరంగా మారుతాయి. అంతేగాక కండ్లనుండి వేడి ఆవిర్లు రావటం, కంటిచూపు మందగించడం, కళ్ళలో మంటలుపుట్టడం, కళ్ళు ఎర్రగా మారటం మొదలైన కం సమస్యలు నివారించబడతయ్. ఆ సమస్యలులేనివారికి ఎప్పటికీ కంటివ్యాధులు రాకుండ కళ్ళుకాపాడబడతాయి.

Post a Comment

0 Comments