దీపారాధన ఫలితాలు
దీపం జ్యోతిః పరబ్రహ్మ దీపంజ్యోతిః నమో నమః
దీపేన హరతేపాపం దీప దేవి నమో నమః
దీపం పర బ్రహ్మ స్వరూపం. పరాయణత్వం కలిగిందై, పాప ప్రక్షాళన చేస్తుంది. మన ఇంట సిరులు ఇచ్చే దీపజ్యోతియే ! అట్టి దీపదేవికి నమస్కరిస్తున్నాను.
దీపం జ్ఞానానికి చిహ్నం. నిర్లక్ష్యమన్న చీకటిని పారదోలే దివ్యజ్యోతి. ప్రతి ఇంట్లోనూ దేవుని ముందు ఉదయం, సాయంసంధ్య వేళ ఒకటి, రెండుసార్లు దీపారాధన చేయడం హిందువుల ఆచారం. ఇళ్ళల్లో ఎప్పుడూ దీపం వెలుగుతూనే ఉంటుంది. దీనిని 'అఖండ' దీపం అంటారు. అన్ని పవిత్ర సందర్భాలలోనూ జ్యోతి వెలిగించి ప్రారంభించే సంప్రదాయం మనకు ఉంది. దీప కాంతి చీకటిని పారదోలినట్లే, జ్ఞానం నిర్లక్ష్య ధోరణిని నిర్మూలి స్తుందంటున్నారు పెద్దలు.
అందుకే అన్ని రూపాల్లోని సంపద అయిన గొప్ప జ్ఞానాన్ని సముపార్జించుకోవడం కోసం, అన్ని పవిత్ర సందర్భాలలోనూ మన ఆలోచనలకు, చర్యలకు సాక్ష్యంగా జ్యోతి వెలిగిస్తాం. సంప్రదాయబద్ధంగా వెలిగించే నూనే దీపానికి ఆధ్యాత్మిక గుర్తింపు ఎక్కువుగా ఉంటుంది. దీపపు కుందిలో పోసే నెయ్యి లేదా నూనె, వత్తి మనలోని కోరికలు, అహంభావ ధోరణులకు సంకేతం. భగవంతుని ముందు దీపం వెలిగించగానే మనలోని కోరికలు నెమ్మదిగా ఆవిరవుతూ, అహం కాలిపోతూ వుంటుందని అర్ధం చేసుకోవాలి.
రాతి యుగంలో రాతినే దీపపు సెమ్మెలుగా మలచి దీపారాధన చేసే వారు. అన్ని గుళ్ళల్లలోనూ దీపారాధనకు ఉపయోగించేవారు. ఆ తరువాత మట్టి ప్రమిదలు వాడుకలోకి వచ్చేసాయి. ఆర్థికంగా ఉన్న వారు స్వర్ణదీపాలు, నవరత్నాలు పొదిగిన దీపాలను సెమ్మెలుగా మలచి దీపారాధన చేసేవారు.
కొన్ని ప్రదేశాలలో దీపారాధన విశేషమైన ఫలితాలను ఇస్తాయి
మనం ఇంట్లో చేసే నిత్య దీపారాధనను 'వ్యష్టి' దీపారాధన అంటారు. అంటే ఇంటికి వెలుగునిచ్చి, ఆ ఇంటిల్లిపాదికి ఐశ్వర్యసం పద కలిగించేది. అలాగే దేవాలయాలలో చేసే దీపారాధనకు దేవతల అనుగ్రహం కలుగుతుంది... విశేష ఫలితాలను ఇస్తుంది. తులసి కోట వద్ద చేసే దీపారాధనని' బృందావన' దీపారాధన అంటారు.
దేవుడికి ప్రత్యేకించి చూపించే దీపారాధనను అర్చనా దీపాలు అంటారు. నిత్య పూజలలో ఉపయోగించే చిరుదీపాలను నిరంజన దీపాలంటారు. గర్భగుడిలో వెలిగించే దీపాన్ని నందా దీపం అని అంటారు. లక్ష్మిదేవి ఉన్న గర్భగుడిలో వెలిగించే దీపాన్ని లక్ష్మి దీపం అంటారు. దేవాలయ ప్రాంగణంలో ఉన్న బలిపీఠంపై వెలిగించే దీపాన్ని ఆ దేవాలయ దృష్టి నివారణగా బలిదీపం అని అంటారు. ఆ సమీపాన ఉన్న ఎత్తైన స్థంబం పై వెలిగించిన దీపాన్ని ఆకాశ దీపం అంటారు.
పంచాయతన దేవాలయాలలో దేవతలు శివుడు, విష్ణువు, అంబిక, గణపతి, ఆదిత్యుడు(సూర్యుడు) మొదలైన దేవత దగ్గర వెలిగించే దీపారాధనకు వివిధ పేర్లు ఉన్నాయి. శైవరూపంలో నందిరూపంగా, నాగరూపంగా మేళవించిన దీపాలు కనిపిస్తాయి. విష్ణువు వద్ద దీపకృతులు: శంఖు, చక్ర, గద, పద్మ రూపాలు కనిపిస్తాయి.
ఏక ముఖం మధ్యమం, ద్విముఖం కుటుంబ ఐక్యత, త్రిముఖం ఉత్తమ సంతాన సౌభాగ్యం, చతుర్ముఖం పశుసంపద మరియు ధన సంపద, పంచముఖం సిరిసంపదుల వృద్ధి ఫలితములు ఉండును.
అలాగే మట్టి, వెండి పంచలోహాదుల ప్రమిదలు దీపారాధనకు వాడటం శ్రేష్టం. వెండి కుందులు అగ్రస్థానం. పంచలోహపు కుందులు ద్వితీయ స్థానం. దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా ప్రమిదల క్రింద చిన్న పళ్ళెము పెట్టడం శ్రేష్టం. మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే, ఆ ప్రమిద క్రింద మరో ప్రమిద పెట్టాలి.
ఇంట్లో వెలిగించే దీపారాధన సంధ్యా సమయాలలో తప్పనిసరిగా చెయ్యాలి. నిత్యం శుభఫలితాలను ఇస్తు, దుష్ట శక్తులు నశిస్తాయి. ఆ ఇంటా అందరు క్షేమంగా ఉంటారు.
దీపం వెలించడానికి ఒక వత్తి ఉపయోగించరాదు. ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్థం. దీపారాధనకు స్టీలు ప్రమిదలు, ఒక వత్తి దీపం శవం ముందు వెలిగిస్తారు. అంటే జీవుడు పరమాత్మలో కలిశాడని అర్థం. దీపారాధనకు స్టీలు ప్రమిదలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపయోగించరాదు. అగ్గిపుల్లతో దీపం వెలిగించరాదు. అగరబత్తీల ద్వారా వెలిగించవచ్చు. దీపం కొండెక్కితే 'ఓం నమః శివాయ' అని 108 సార్లు జపించి దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి కీడు జరగదు.
దీపారాధన తర్వాత మూడు చోట్ల కుంకుమ పెట్టి అక్షితలు వేస్తే మంచిది. సూర్యాస్తమయం నుంచి సూర్యోదయందాకా, దీపం ఉన్న ఇంటిలో, దారిద్య్ర్యం ఉండదు. దీపారాధన చేసేటప్పుడు ముందుగా నూనె పోసి తర్వాత వత్తులు వేయాలి.
0 Comments