🛕 మార్చి 30 నుండి ఏప్రిల్ 01 వరకు తిరుమల శ్రీవారి వసంతోత్సవాలు
📍 తిరుమల | 📅 2026 మార్చి 22
తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
📅 ఉత్సవాల వివరాలు
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేలా ఈ ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ.
🟢 మార్చి 30:
ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి చేరుకుని అభిషేకాలు పూర్తి చేసి తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
ఉదయం 6.30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు నాలుగు మాడవీధులలో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి చేరుకుని అభిషేకాలు పూర్తి చేసి తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
🔵 మార్చి 31:
ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథంపై ఊరేగింపు జరుగుతుంది. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
ఉదయం 8 నుండి 10 గంటల వరకు బంగారు రథంపై ఊరేగింపు జరుగుతుంది. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు.
🟠 ఏప్రిల్ 01:
శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా పాల్గొని వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి, శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు కూడా పాల్గొని వసంతోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
🕉️ ప్రత్యేక కార్యక్రమాలు
ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్నపన తిరుమంజనం జరుగుతుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు.
సాయంత్రం 6 నుండి 6.30 వరకు ఆస్థానం ఘనంగా నిర్వహిస్తారు.
సుగంధ పుష్పాలు మరియు ఫలాలతో స్వామివారికి నివేదనలు చేయడం ఈ ఉత్సవంలో ముఖ్యాంశం.
⚠️ రద్దు చేసిన సేవలు
మార్చి 30 నుండి ఏప్రిల్ 01 వరకు:
- కల్యాణోత్సవం
- ఊంజల్ సేవ
- ఆర్జిత బ్రహ్మోత్సవం
- సహస్రదీపాలంకార సేవ
📢 టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది.
