GET MORE DETAILS

ఒమిక్రాన్ కలకలం.. బోట్స్​వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట

ఒమిక్రాన్ కలకలం.. బోట్స్​వానా నుంచి వచ్చిన మహిళ కోసం వేట




కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్​’ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ గుబులు రేపుతోంది. ఈ వేరియంట్‌ మొదట దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని బోట్స్​వానా నుంచి భారత్​కు వచ్చిన ఓ మహిళను పట్టుకునే ప్రయత్నంలో పడ్డారు అధికారులు. ఈ నెల 18న ఆమె మధ్యప్రదేశ్​లోని జబల్​పుర్​కు వచ్చినట్లు జబల్​పుర్ వైద్యాధికారి డా.రత్నేష్​ కురారియా తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘బోట్స్‌వానా దౌత్య కార్యాలయం నుంచి ఓ అధికారి మాకు ఫోన్ చేశారు. ఆ దేశం నుంచి వచ్చిన మహిళ.. జబల్​పుర్‌లోని మిలిటరీ ఆర్గనైజేషన్​లో ఐసోలేషన్​లో ఉన్నట్లు తెలిపారు. సదరు మహిళ ఫోన్​ నంబర్​, స్థానికంగా ఉన్న అడ్రస్​ను షేర్ చేయమని వారితో చెప్పాం’ అని తెలిపారు.
సదరు మహిళ పేరు కునో ఓరెమీట్ సెలిన్ అని, ఆమె ఎక్కడుందో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని వైద్యాధికారి కురారియా పేర్కొన్నారు. రికార్డుల ప్రకారం.. సెలిన్​ దిల్లీ నుంచి జబల్​పుర్​కు వచ్చినట్లు ఆయన తెలిపారు. జబల్​పుర్​లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని.. పట్టణం​లోని అన్ని హోటళ్లతోపాటు సరిహద్దు జిల్లాల నుంచి సమాచారం సేకరించామని పేర్కొన్నారు
.

Post a Comment

0 Comments