GET MORE DETAILS

44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు

 44 మందికి తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారాలు



హైదరాబాద్‌, న్యూస్‌టుడే: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018 సంవత్సరానికి గాను తెలుగు రాష్ట్రాలకు చెందిన 44 మంది ప్రముఖులను పురస్కారాల కోసం ఎంపిక చేసింది. వీరిలో.. డా.గంపా నాగేశ్వరరావు (వ్యక్తిత్వ వికాసం), స.వెం.రమేష్‌ (భాషాచ్ఛందసాహిత్య విమర్శ), డా.మచ్చ హరిదాస్‌ (సాహిత్య విమర్శ), మెట్టు మురళీధర్‌ (కథ), తాటికొండల నరసింహారావు (నాటకరంగం), డా.బి.జానకి (జనరంజక విజ్ఞానం), ఎం.వి.రామిరెడ్డి (కాల్పనిక సాహిత్యం), ఎం.పవన్‌కుమార్‌ (ఉత్తమ ఉపాధ్యాయుడు), రాజశుక (పత్రికా రచన), మరిపాల శ్రీనివాస్‌ (జీవిత చరిత్ర), జావేద్‌ (కార్టూనిస్టు), డా.ఆర్‌.కమల (ఉత్తమ రచయిత్రి), డా.పూస లక్ష్మీనారాయణ (వచన కవిత), కోడూరు పుల్లారెడ్డి (సృజనాత్మక సాహిత్యం), డా.ఎం.శ్రీకాంత్‌కుమార్‌ (పరిశోధన), డా.గురవారెడ్డి (హాస్యరచన), సి.జానకీబాయి (ఉత్తమనటి), వల్లూరి శ్రీహరి (ఉత్తమ నటుడు), రావుల పుల్లాచారి (ఉత్తమ నాటక రచయిత), షేక్‌ బాబు (హేతువాద ప్రచారం), డా.విజయలక్ష్మీ పండిట్‌ (ఉత్తమ రచయిత్రి), డా.టి.వి.భాస్కరాచార్య (వివిధ ప్రక్రియలు), పుల్లూరి ప్రభాకర్‌ (అవధానం), డా.సూరేపల్లి సుజాత (మహిళాభ్యుదయం), అడ్లూరి రవీంద్రాచారి (గ్రంథాలయకర్త), ఆచార్య దొర్తి ఐజాక్‌ (గ్రంథాలయ సమాచార విజ్ఞానం), జి.కిరణ్మయి (ఆంధ్రనాట్యం), గులాబీల మల్లారెడ్డి (నవల), గడ్డం శ్రీనివాస్‌ (జానపద కళలు), ఆచార్య మాడభూషి శ్రీధర్‌ (ఆధ్యాత్మిక సాహిత్యం), తిరువాయిపాటి చక్రపాణి (పద్యం), సంజయ్‌కిషోర్‌ (సాంస్కృతిక సంస్థ నిర్వాహణ), వొల్లాల వాణి (జానపద గాయకులు), డా.వాసరవేణి పరశురాములు (బాలసాహిత్యం), మ్యాజిక్‌ బోస్‌ (ఇంద్రజాలం), డా.మోత్కూరి మాణిక్యరావు (పద్యరచన), దివాకర్ల సురేఖామూర్తి (లలిత సంగీతం), ఇందిరా కామేశ్వరరావు (శాస్త్రీయ సంగీతం), డా.సాగి కమలాకరశర్మ (జ్యోతిషం), ఆచార్య వెనకపల్లి తిరుపతయ్య (గేయం), బి.సుధీర్‌రావు (కూచిపూడి నృత్యం), డా.బి.జయరాములు (ప్రాచీన సాహిత్యం), కృష్ణానాయక్‌ చౌహాన్‌ (అనువాద సాహిత్యం), డా.పి.లక్ష్మీరెడ్డి (చిత్రలేఖనం)లు కీర్తి పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరికి జనవరిలో హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తారు. పురస్కారం కింద రూ.5,116 నగదుతో పాటు పురస్కార పత్రాన్ని అందజేస్తారని వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య భట్టు రమేశ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Post a Comment

0 Comments