GET MORE DETAILS

డాక్యుమెంటరీ రైటర్ లను ఇతర వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లోనికి "నో ఎంట్రీ" : ఐజీ కీలక ఆదేశాలు.

డాక్యుమెంటరీ రైటర్ లను ఇతర వ్యక్తులను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల లోనికి "నో ఎంట్రీ" : ఐజీ కీలక ఆదేశాలు.



రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంటరీ రైటర్ లను ఇతర వ్యక్తులను సబ్ రిజిస్టర్ కార్యాలయాలు లోనికి అనుమతించరాదని  కీలక ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంటరీ రైటర్లు సబ్ రిజిస్ట్రార్ లను ప్రలోభపరుస్తున్నారని అందువల్ల వారిని దూరంగా పెట్టాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ వి.రామకృష్ణ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అవినీతి నిరోధక శాఖ వివిధ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి నపుడు సబ్-రిజిస్ట్రార్లు తమకు తాబేదార్లుగా డాక్యుమెంటరీ రైటర్లలను నియమించు కుంటున్నారని వారికి బినామీలుగా ఉంటూ ఏరోజు కారోజు వచ్చిన పర్సంటేజీలు మామూలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ముగిసిన తర్వాత అంతా చేస్తున్నారని అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ఒక నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలో 295 సబ్ రిజిస్ట్రార్  కార్యాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క  కార్యాలయంలో 15 మంది డాక్యుమెంట్ రైటర్లు పని చేస్తున్నారు. గతంలో ఒకసారి ఈ ఉత్తర్వులు 1995 జనవరి 9న జారీ అయ్యాయి తిరిగి ఈ నెల 17న సర్క్యులర్ మెమో నెంబర్ విజిలెన్స్ 2 /82 64 / 2021 ప్రకారం ఆదేశాలు జారీ అయ్యాయి.

సాధారణంగా డాక్యుమెంటరీ రైటర్లు బ్రిటిష్ కాలం నుండి వంశ పారంపర్యంగా డాక్యుమెంట్ రైటర్లు పనిచేస్తున్నారు. వారి పరిధిలో సర్వే నెంబర్లు, భూమి రికార్డులు అన్ని వారి వద్దనే ఉంటాయి. సాధారణంగా క్రయ విక్రయాలు జరిగినప్పుడు డాక్యుమెంట్ రైటర్లు తమదైన శైలిలో డాక్యుమెంట్లను తయారు చేస్తూ ఉంటారు. గత రెండేళ్లుగా వీరి లైసెన్సులను రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేయలేదు. వీటికి సంబంధించిన ఫైలు ప్రభుత్వం వద్ద ఇంకా పెండింగ్ లో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం తో డాక్యుమెంటరీ రైటర్లు హైకోర్టును ఆశ్రయించనున్నారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అరకొరగా సిబ్బంది ఉండడంతో రిజిస్ట్రేషన్ విషయంలో డాక్యుమెంటరీ సిబ్బంది సహాయ సహకారాలను అందించడం పరిపాటి. 2014 జనవరి 18న ఉమ్మడి రాష్ట్రంలో డాక్యుమెంట్ రైటర్లు అప్పట్లో పెద్ద ఎత్తున సమ్మె చేశారు. అప్పట్లో వారం రోజుల పాటు ఉమ్మడి రాష్ట్రంలో స్థిరాస్తి రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. స్థిరాస్తి రిజిస్ట్రేషన్ దరఖాస్తులను మీ-సేవ కు అప్పగించాలనే ప్రభుత్వ ప్రతిపాదనను విరమించుకోవాలని డాక్యుమెంట్ రైటర్ల సమ్మె చేశారు. జనవరి 14 నుండి 22 వ తేదీ వరకు అప్పట్లో సమ్మె జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్టార్ కార్యాలయాలు వెలవెల పోవడంతో అప్పటి రెవెన్యూ ముఖ్య కార్యదర్శి వీకే అగర్వాల్ ప్రభుత్వ ప్రతిపాదనలను విరమింపజేశారు.

నేడు తిరిగి అదే రీతిలో డాక్యుమెంటరీ రైటర్లు సమ్మె చేయనున్నారు. ఇదిలా ఇలా ఉండగా రాష్ట్ర అసోసియేషన్ ఆదివారం నాడు సమావేశమై కమిషనర్ వి రామకృష్ణ ఆదేశాలపై హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

0 Comments