నడిరోడ్డుపై ప్రశ్నపత్రాలు
ప్రభుత్వ పాఠశాలల ఫార్మెటివ్ అసెస్మెంట్-2 పరీక్ష ప్రశ్నపత్రాలు రోడ్డు పాలయ్యాయి. ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఈనెల 17వ తేదీ నుంచి నిర్వహించాల్సిన పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను విజయవాడ నుంచి విశాఖపట్నం వ్యానులో తరలిస్తుండగా వాటికి కట్టిన తాడు తెగిపోవడంతో పశ్చిమ గోదావరి జిల్లా గుణ్ణంపల్లి వద్ద జాతీయ రహదారిపై పడిపోయాయి. మూడు కిలోమీటర్ల మేర రోడ్డుపై ప్రశ్నపత్రాలు చెల్లాచెదురుగా పడిపోవడంతో.. వాటిని డ్రైవర్, సిబ్బంది సేకరించి వ్యానులో పెట్టారు. - భీమడోలు
0 Comments