పీఆర్సీపై 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం : సీఎస్ సమీర్ శర్మ
సీఎం జగన్తో సీఎస్ సమీర్ శర్మ భేటీ అయ్యారు. సీఎంకు పీఆర్సీ నివేదికను ఆయన అందజేశారు. ఈ భేటీ అనంతరం సమీర్శర్మ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ నివేదికను ప్రభుత్వ వెబ్సైట్లో పెడతామన్నారు. ఉద్యోగ సంఘాలకు కూడా నివేదిక పంపిస్తామని, సీఎం జగన్కూ పీఆర్సీపై నివేదిక ఇచ్చామని చెప్పారు. 72 గంటల్లో సీఎం జగన్ నిర్ణయం తీసుకుంటారని, ఈ పీఆర్సీ అమలుతో ప్రభుత్వంపై రూ. 10 వేల కోట్ల భారం పడుతుందన్నారు. 27 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కమిటీ సూచించినట్లు తెలిపారు. పీఆర్సీ ఫిట్మెంట్పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని, 2018 నుంచి పీఆర్సీ అమలవుతున్నట్లు సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు.
0 Comments