GET MORE DETAILS

నాదేశం - భారతదేశం - గొప్పదనం

నాదేశం - భారతదేశం - గొప్పదనం 



900 సంవత్సరాల ముందు వరకు అమెరికా లేదు, కొలంబస్ తెలిపాడు ప్రపంచానికి.

2000 సంవత్సరాల ముందు వరకు ఇజ్రాయిల్ లేదు, ఏసు అనే వ్వక్తి తెలిపాడు ప్రపంచానికి.

5000 సంవత్సరాల ముందు వరకు చైనా లేదు, మన బోధి ధర్ముడు తెలిపాడు ప్రపంచానికి.

1400 సంవత్సరాల ముందు వరకు అసలు ఇస్లాం దేశాలే లేవు, కొత్తగా ఏర్పడినవి.

మరి భారత దేశం వయసు ఎంత ?

ప్రపంచంలో  ప్రపంచ చరిత్ర కారుల, పరిశోధకుల కొలమానాలకు  అందనంత వయసు నా దేశం వయసు ఇదీ నా భారత దేశం గొప్పతనం ప్రపంచ తత్వవేత్త, పురావస్తు శాస్త్రవేత్త, జర్మన్ సైంటిస్ట్ అయిన "ఆర్నాల్డ్ టాయన్బీ" పరిశోధన ప్రకారం...

ప్రపంచంలోని 28 ప్రాచీన సంస్కృతులు గల దేశాలలో నేటికీ సజీవంగా ఉన్న సంస్కృతి గల దేశం భారతదేశం మాత్రమే...

వైదిక  సంస్కృతికి మరో రూపాంతరమైన "ఈజీప్ట్ సంస్కృతి"  కూడా నేడు లేదు. కేవలం "పైన పిరమిడ్-కింద మమ్మీలు " మిగిలాయి.

విశ్వవిజేత అలెగ్జాండర్ భారత్ లోనే ఓడించబడ్డాడు పురుషోత్తమునిచే. అతని "గ్రీకు దేశం" నేడు లేదు.

ఎగుమతుల ద్వార ప్రపంచ వర్తక సామ్రాజ్య దేశంగా మారిన "రోమ్" నేడు లేదు.

ఇలా అస్తేరియా, సుమేరియా, బాబిలోనియా, మెసపటోనియా... ఇలా 27 దేశాలు నేడు లేవు.

ఎన్ని సంస్కృతులు నాశనమైనా తన సంస్కృతి ఉనికిని కాపాడే యోధులకు జన్మనిచ్చినదే... "నా దేశం-భారత దేశం"

ప్రపంచంలో ఆక్రమణకి గురికాని దేశం ఏమైనా ఉందా...? లేదనే అనాలి. మరి ఒక్క ఆక్రమణ చేయని దేశం ఏమైనా ఉందా...? ఉంది. చరిత్ర పుటల్లో నాటికి...నేటికి... "శాంతికి నిలయమైన దేశం - నా భారత దేశం"

ఈజీప్ట్ మీద పాలస్తీనా, అరేబియా దేశాల దండయాత్రలతో 1500 సం.ల్లో మొత్త సంస్కృతి నాశనమయింది. నేడు ఇస్లాం దేశంగా మారింది.

రోమ్ మీద కేవలం 7,8సం...ల దాడులతో దాని సంస్కృతి నాశనం చేసారు. ఇప్పుడు ఇస్లాం దేశం అయిపోయింది.

మరి మన భారతీయ సంస్కృతిపై జరిగిన దాడులెన్ని ?

హూనులు, శకులు, కుశానులు, తుష్కరులు, మొఘలులు, సుల్తానులు, నవాబులు, షేక్ లు, పఠాన్ లు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, బ్రిటీష్ వారు...ఇలా ఒకరి తర్వాత ఒకరు దాడులు చేసారు. కానీ ఏంటి లాభం !? ఏమి పీక లేక పోయారు 

ప్రపంచానికి మన సంస్కృతి గొప్పతనం తెలియజేయటం.

ఇంకా ఇన్ని దండయాత్రల తర్వాత కూడా నేటికి నిరంతరాయంగా ప్రపంచ ప్రాచీన సంస్కృతికి నిలయమే...

"హైందవ దేశం - నా భారత దేశం" ప్రపంచానికి విజ్ఞానం నేర్పించిన దేశం నా దేశం

మరి దేశభక్తుల విషయం...

1857 మే 10 మొదటి స్వరాజ్య సంగ్రామం మొదలుకుని 1947 ఆగస్ట్ 15 వరకు 90సం.. వ్యవధిలో నా దేశం లో ఇతర దేశస్తుల చేత ఉరితీయబడి బలిదానం ఇచ్చిన వారు ఎందరో తెలుసా?

4 లక్షల 50 వేలకు పైగా కేవలం ఉరితీయబడినవారు మాత్రమే !మరి ఇది మన లైబ్రరీలలో ఉంటుందా ? ఉండదు. ఎక్కడ ఉంటుంది అంటే "Oxford library" (ఇంగ్లాండ్) లో ఉంటుంది. ఎందుకంటే దెబ్బలు తిన్నాక కూడా మళ్ళీ భారత్ మీద దాడి చేయకూడదని గుర్తు పెట్టుకోవటానికి. ఇది నా దేశంలో పుట్టిన సగటు భారతీయుని దేశ భక్తి. ఈ కనీస ఙ్ఞానం లేని మూర్ఖులే నా ధర్మాన్ని, నా దేశాన్ని  విమర్శిస్తారు.

Post a Comment

0 Comments