GET MORE DETAILS

రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు

 రైల్వే పరీక్షా ఫలితాలపై నిరసన... ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు



బిహార్​లో నిరుద్యోగులు మరోసారి రెచ్చిపోయారు. ఈ క్రమంలో కొంత మంది విద్యార్థులు, ఆందోళన కారులు.. పెద్ద ఎత్తున గయా రైల్వేస్టేషన్​  చేరుకున్నారు. ఆతర్వాత  ఆగి ఉన్న ప్యాసింజర్​  రైలుకు నిప్పుపెట్టారు. అంతటితో ఆగకుండా ప్రయాణిస్తున్న రైళ్లపై రాళ్లతో దాడికి తెగబడ్డారు.  దీంతో అక్కడి ఉద్రిక్త వాతావరణం తలెత్తింది.

పోలీసు అధికారుల ప్రకారం..  రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు నాన్​టెక్నికల్​ పాపులర్ ​(RRB-NTPC) సీబీటీ-1 ​పోస్టుల కోసం 2019లో నోటిఫికేషన్​ను విడుదల చేసింది. సదరు నోటిఫికేషన్​లో ఒక దశ పరీక్ష మాత్రమే ఉందని తెలిపారు. కాగా, మొదటి దశకు సంబంధించి పరీక్ష ఫలితాలను జనవరి 15న వెల్లడించింది. అయితే, ఈ పరీక్షలలో పలు అక్రమాలు జరిగాయని నిరుద్యోగులు నిరసనలు చేపట్టారు. కాగా, అభ్యర్థి ఉద్యోగం సాధించాలంటే.. రెండో దశ సీబీటీ కంప్యూటర్​ పరీక్షలో కూడా ఉత్తీర్ణత సాధించాలని రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డు స్పష్టం చేసింది.

రెండు దశల్లో పరీక్ష నిర్వాహణపై నిరుద్యోగులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రభుత్వం నిరుద్యోగుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, బిహర్​ అంతటా నిరసనలు కొనసాగుతున్నాయి. పట్నాలో నిరసన కారులు పెద్ద ఎత్తున రైల్వే ట్రాక్​పై చేరుకుని నిరసనలు తెలిపారు. జెహనాబాద్​లో రైలుపట్టాలపై మోదీ దిష్టిబొమ్మను దహనంచేసి.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అదే విధంగా, సీతామర్హి ప్రాంతంలోను ఆందోళనకారులు పెద్ద  ఎత్తున నిరసనలు తెలిపారు. కాగా, నిరసన కారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలుచోట్ల గాల్లోకి కాల్పులు జరిపారు.  నవాడా, ముజఫర్​పూర్​, సీతామర్హి, బక్సర్​, భోజ్​పూర్​ జిల్లాలో నిరుద్యోగుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. అయితే, దీనిపై రైల్వే రిక్రూట్​మెంట్​ బోర్డ్​ స్పందించింది. తాము.. నోటిఫికేషన్​లోనే రెండో దశ వివరాలను కూడా తెలిపామని స్పష్టం చేసింది.

ప్రస్తుతానికి నాన్​ టెక్నికల్​ పాపులర్​ కేటగిరికి సబంధించి పరీక్షలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ పరీక్షలపై అభ్యర్థుల ఆందోళలను పరిశీలించడానికి రైల్వేశాఖ ఆధ్వర్యంలో హైపవర్​ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది.  అభ్యర్థులు తమ ఈ కమిటికి తమ ఫిర్యాదులను ఫిబ్రవరి 16 వరకు సమర్పించవచ్చని రైల్వే మంత్రిత్వశాఖ ట్విటర్​ వేదికగా తెలిపింది.

నిరసన కారుల ఆందోళన ప్రధానంగా ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే జోన్​లోని ఆయా మార్గాల్లో  ప్రభావం చూపింది. దాదాపు 25 కంటే ఎక్కువ రైళ్ల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. పట్నాలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. గతంలో కూడా పట్నా రైల్వేస్టేషన్​ను విద్యార్థులు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే.

Post a Comment

0 Comments