GET MORE DETAILS

గిన్నీస్ రికార్డు చేధనలో కమలాకాంత

 గిన్నీస్ రికార్డు చేధనలో కమలాకాంత



 ఒడిశాకు చెందిన పారా అథ్లెట్ కమలాకాంత నాయక్ గిన్నీస్ రికార్డును చేధించేందుకు బరిలో దిగారు. వీల్ చైర్ లో 24 గంటల్లో 200 కి,మీ ప్రయాణించి రికార్డు ను సొంతం చేసేందుకు ఒడిశా వేదికగా ప్రయత్నం మొదలైంది. జనవరి 15 - 16, 2022న ప్రముఖ వీల్‌చైర్ అథ్లెట్ నాయక్ ఈ రికార్డు ప్రయత్నానికి వెళ్లనున్నారు. ఒడిషా స్టేట్ వీల్‌చైర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ కార్యదర్శి మరియు భువనేశ్వర్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ ఈ ప్రయత్నానికి వేదికను ఖరారు చేస్తున్నారు. సీనియర్ కన్సల్టెంట్ Sk అబ్దుల్ రబ్ ఒడిశా స్టేట్ వీల్ చైర్ బాస్కెట్‌బాల్ అసోసియేషన్‌తో కలిసి ఈవెంట్‌ను సమన్వయం చేస్తారు. శనివారం మధ్యాహం 3 గంటలకు ప్రారంభమైన కమలాకాంత వీల్ చైర్  ప్రయాణం ఆదివారం మధ్యాహ్నం 3గంటలకు ముగుస్తుంది.

ఇంతకు ముందు 24 గంటల్లో 184 కి.మీ ప్రయాణించిన రికార్డు ఉంది.

Post a Comment

0 Comments