ఏకదండి, ద్విదండి, త్రిదండి స్వాముల చేతిలో కర్రలెందుకు ఉంటాయో తెలుసా...
★ ఆది శంకరాచార్యుల నుంచి నేటి అందరు స్వాముల వరకూ చేతిలో కర్ర ఉండటాన్ని అందరూ గమనించే ఉంటారు.
★ స్వామీజీ అంటే కర్ర పట్టుకోవాలనుకుంటే పొరపాటే..
★ దాని వెనుక ఎంత ఆంతర్యం ఉందో తెలుసా...
★ ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులు, రామానుజచార్యులు, జీయర్ స్వాములు మరికొందరు..వీళ్లందరి చేతిలో పొడవాటి కర్ర ఉంటుంది గమనించారా.
★ ఏ సమయంలో చూసినా వాళ్ల చేతిలో ఉంటాయి.
★ అదేమైనా ఊతకోసమా అంటే కానేకాదు.
★ మరి ఎప్పుడూ చేత్తో పట్టుకుని ఉంటారెందుకు అంటారా..
★ అవి వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తు.
★ ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాల్లో ఉంటాయి.
★ అయితే ప్రతి ఆకారానికి ఓ అర్థం ఉంది.
★ గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం పంచభూతాల సమ్మేళనమే మనిషి,
★ కాబట్టి సన్యాసులు ఐదడుగుల కర్రను చేతపట్టుకుని తిరుగుతారని చెబుతారు.
★ ఈ కర్రల్లో మూడు రకాలున్నాయి అవే ఏకదండి, ద్విదండి, త్రిదండి.
ఏకదండి :
■ ఒక కర్రను (ఏకదండి ) ధరించేవారు అద్వైత సిద్ధాంతాన్ని విశ్వసిస్తారు.
■ అందుకు ఉదాహరణ ఆదిశంకరాచార్యులు.
■ అద్వైతం అంటే జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం.
■ అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు.
■ వీరి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుంచి సేకరించిన కర్ర ఉంటుంది.
ద్విదండి :
◆ రెండు కర్రలు కలిపి ఒక్కటిగా కట్టి (ద్విదండి)ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతాన్ని అవలంబించేవారు.
◆ ఇందుకు ఉదాహరణ మధ్వాచార్యులు.
◆ వీరిని ‘ద్విదండి స్వాములు’అంటారు. దేవుడు వేరు– జీవుడు వేరు అని బోధిస్తారు.
◆ జీవాత్మ, పరమాత్మ వేరువేరన్నది వీరి ఉద్దేశం.
◆ జీయర్ లు అందరూ ఈ సిద్ధాంతం కిందకు వస్తారు.
త్రిదండి :
● మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అంటారు.
● ఇలా ధరించే వారు విశిష్ఠాద్వైతాన్ని బోధిస్తారు.
● వీరిది రామానుజాచార్యుల పరంపర.
● శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని విశ్వసిస్తారు.
● జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ,
● జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధాన చిక్కుకుంటాడని,
● నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుంచి విముక్తులై,
● మరణానంతరం నారాయణ సాన్నిధ్యం, మోక్షం పొందుతారని,
● వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు.
● ఇది ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే వాటి గురించిన వివరణ, స్వస్తి.
మీ భవయోగితాచార్య,
0 Comments