GET MORE DETAILS

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూత

ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి (49) కన్నుమూత



◆ ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేరిన ఆయన అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

◆ ఆస్పత్రికి వచ్చేటప్పటికే గౌతమ్ పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని తెలుస్తోంది.

◆ దీంతో అత్యవసర చికిత్స అందించినప్పటికీ ప్రాణం నిలబడలేదు.

◆ ఆయన మరణించారన్న విషయాన్ని గౌతమ్ భార్యకు అపోలో వైద్యులు సమాచారం ఇచ్చారు.

◆ మంత్రి ఇకలేరన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

◆ ఆయన హఠాన్మరణంతో అభిమానులు, వైసీపీ కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

◆ వారం రోజుల పాటు దుబాయ్ పర్యటన ముగించుకొని నిన్న (ఆదివారం నాడు) గౌతమ్‌ హైదరాబాద్‌కు వచ్చారు.

Post a Comment

0 Comments