GET MORE DETAILS

"మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట ఎందుకని?...!!

"మనిషి సంపాదన కాలి చెప్పు అంత ఉండాలట ఎందుకని?...!!



● కాలి చెప్పు పాదము యొక్క పరిమాణమునకు ఎలా సరిపోతుందో, అలా ధనము కూడా నీకు కావలిసినంత ఉంటే చాలు అని "వేదాంత" వాక్య. 

● లోకం లోని 84 లక్షల జీవరాసులలో తరువాతి తరానికి కూడబెట్టడం అన్న లక్షణం ఉన్న ఏకైక ప్రాణి మనిషి ఒక్కడే.

● మిగిలిన ఏ ప్రాణి అయినా తమ బిడ్డలకు స్వయంగా ఆహారం సంపాదించుకునే శక్తి వచ్చే వరకే వాటిని పోషిస్తాయి. 

● ప్రకృతి పరమైన ఇబ్బందులు దృష్ట్యా కేవలం ఒక్క చీమ మాత్రం ఆహారాన్ని నిలువ చేసుకుంటుంది.

● "లోకంలో అజ్ఞానం ఎప్పుడు మొదలు అయ్యింది అంటే ప్రింటింగ్ ప్రెస్సువచ్చిన తరువాత. 

● లోకంలో దరిద్రం ఎపుడు వచ్చింది అంటే డబ్బు వచ్చినపుడు ".

● పేపర్ కరెన్సీ రానంత వరకు ఎవరికి అవసరానికి సరిపడేదివారు వస్తు వినిమయంతో సంపాదించుకొని తినేవారు.  

● ఆరోజుల్లో దరిద్రం అంతగాలేదు. ఎంత తిండికి అవసరమో అంత సంపాదించుకునే వారు. 

● మహా దాచుకున్న రెండు ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉంటే సంవత్సరానికి సరిపోయేవి. 

● ఎపుడు కరెన్సీ వచ్చి దాచుకోవడం మొదలు అయిందో. ఒకడి కన్నా వేరొకరు పోటీ పడి రంగు కాగితాలు కట్టలు కట్టి దాచుకోవడం మొదలెట్టారు. ఫలితంగా వాడి కన్నా వీడికి, వీడి కన్నా వాడికి దరిద్రం వచ్చి పడింది.

● ప్రింటిగ్ ప్రెస్ వచ్చి ఎవరికి తోచిన విధంగా వారు పుస్తకాలు వ్రాసి లోకం మీదకు వదిలేశారు. 

● వారి భావాలన్ని జనాలకు అంటుకున్నాయి. తెలిసి తెలియని వాడు ఆ పుస్తకాలు చదివి అసలు  విషయం తెలుసుకోలేక అజ్ఞానంలోకి వెళ్ళి పోయాడు. 

● వస్తు మార్పిడి ఉన్న రోజుల్లో జనాల్లో ఇంత దరిద్రం లేదు. ముందు తరాల వారికి దాచాలన్న వెర్రి కోరిక మనిషిని అజ్ఞానంలోకి నెట్టి వేస్తుంది.

Post a Comment

0 Comments