GET MORE DETAILS

మన ఇతిహాసాలు - కృష్ణుడి చివరి సందేశం.

 మన ఇతిహాసాలు - కృష్ణుడి చివరి సందేశం.

 


శ్రీ కృష్ణుడు కురుక్షేత్రంలో అర్జునుడికి చెప్పిన సందేశం గీతరూపంలో అందరికీ తెలిసిందే. అయితే కృష్ణుడు చివరిసారిగా బోధించిన సందేశం మరొకటి ఉంది. అదే ఉద్దవ గీత. ఉద్ధవుడు శ్రీ కృష్ణుడికి చిన్ననాటి స్నేహితుడు. కృష్ణుడికి రథసారధి కూడా. అయితే ద్వాపరయుగంలో కృష్ణుడు తన అవతారం చాలించే ముందు ఉద్ధవుడిని పిలిచి. “ఉద్దవా, నా నుంచి ఎంతోమంది ఎన్నో వరాలు పొందారు.కానీ, నువ్వు నన్ను ఎప్పుడూ ఏదీ కోరలేదు.నీ స్నేహానికి బహుమతిగా ఏదైనా ఇవ్వాలని ఉంది, ఏమికావాలో కోరుకో"మంటాడు. అప్పుడు ఉద్దవుడు అడిగిన ప్రశ్నలకు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానమే ఈ ఉద్ధవ గీత.కృష్ణుడి మాటలకు ఉద్దవుడు.. “కృష్ణా, నీ లీలలను అర్థం చేసుకోవటం ఎవ్వరివల్లా కాదు. నాకు నీ నుంచి ఏ వరమూ వద్దు.కానీ నేను నిన్ను కొన్ని సందేహాలు అడుగుదామనుకుంటున్నాను. అడగమంటావా" అని అంటాడు. కృష్ణుడు ““నువ్వు ఏది అడిగినా చెప్తాను. అడుగు ఉద్దవా" అంటాడు. అప్పుడు ఉద్దవుడు. నువ్వు వారి వర్తమానం, భవిష్యత్తు తెలిసినవాడివి. అలాంటప్పుడు వారిని జూదము ఎందుకు ఆడనిచ్చావు? అసలు అలాంటి వ్యసనాలను ఎందుకు ప్రోత్సహించావు? ఒకవేళ జూదం ఆడనిచ్చినా. కనీసం వారిని గెలిపించి, కౌరవులకి బుద్ధి చెప్పి ఉండాల్సింది కదా? అది కూడా చెయ్యలేదు. యుధిష్టరుడు అంతా పోగొట్టుకుని వీధిన పడ్డాడు. తన తమ్ముళ్లను కూడా ఓడిపోయాడు. అప్పుడైనా నువ్వు వాళ్లని కాపాడి ఉండొచ్చు కదా? కౌరవులు దుర్బుద్ధితో జూదంలో మోసం చేసి, ద్రౌపదిని గెలిచారు. కనీసం అప్పుడైనా నువ్వు నీ మహిమతో పాండవులని గెలిపించి ఉండాల్సింది. ఆమె గౌరవానికి భంగం కలిగేవరకూ నువ్వు స్పందించలేదు.... సమయానికి ఆదుకున్న ఆపద్భాందవుడవని గొప్ప పేరుపొందావు. కానీ ముందే నువ్వు కలుగజేసుకుని ఉంటే ఆమెకి నిండు సభలో అవమానం తప్పేది కదా? ఇలా చేయడం వెనుక కారణమేంటి కృష్ణా..."అని ఉద్దవుడు కృష్ణుడ్ని అడుగుతాడు.ఎంతో తెలివిగా తన మామ చేత పందెంను వేయించాడు. కానీ యుధిష్టరుడు మాత్రం.. పందాలను నా చేత వేయిం చాలి అని అనుకోలేదు. నా సాయమును కోరనే లేదు. శకునితో నేను ఆడి ఉంటే జూదము ఎవరు గెలిచేవారు? నేను కోరిన పందెంను శకుని వేయగలిగేవాడా? లేదా అతను చెప్పిన పందెం నాకు పడేది కాదా? ఈ ఒక్కవిషయమే కాదు, ధర్మరాజు అజ్ఞానంతో మరొక తప్పు కూడా చేశాడు. నేను చేసుకున్న కర్మల వలన ఈ ఆటలో ఇరుక్కున్నాను. కృష్ణుడికి ఈ సంగతి తెలియకూడదు, ఇటువైపు రాకూడదు అని ప్రార్థించాడు. దాంతో ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. యుధిష్టరుడు మాత్రమే కాదు, భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఓడినప్పుడు వారి కర్మ అనుకున్నారే కానీ నా సాయం కోరలేదు. చివరికి ద్రౌపది కూడా దుశ్సాసనుడు సభలోకి ఈడ్చుకెళ్లినప్పుడు కూడా నన్ను స్మరించకుండా నిండు సభలో తనకు న్యాయం చెయ్యమని వాదించింది. తన బుద్ధి కుశలతలనే నమ్ముకుంది.

తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యే వరకూ నన్ను స్మరించలేదు. సంపూర్ణ శరణాగతితో నన్ను శరణు వేడుకోగానే.. నేను మెటనే ప్రత్యక్షమయ్యి ద్రౌపదిని రక్షించలేదా?" అని కృష్ణుడు ఉద్ధవుడిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఉద్ధవుడు, కృష్ణుడితో... “అలాగైతే మాలాంటి సామాన్యులు సంగతేంటి? మానవ జీవితం వారు చేసుకున్న కర్మల ద్వారానే సాగుతుంది. వాటిలో నేను కలుగజేసుకోను. కేవలం సాక్షిలాగా గమనిస్తుంటాను. అదే భగవంతుని ధర్మం" అని అంటాడు.

Post a Comment

0 Comments