GET MORE DETAILS

పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు

పదోతరగతి అర్హతతో పోస్టల్ ఉద్యోగాలు



● భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వ శాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా ఉద్యోగాల భర్తీ చేపట్టనుంది.

● ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 38926 ఖాళీలలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఖాళీల వివరాలను పరిశీలిస్తే తెలంగాణలో 1226 ఖాళీలు, ఆంధ్రప్రదేశ్‌లో 1716 ఖాళీలు ఉన్నాయి.

● పోస్టుల వివరాలకు సంబంధించి బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌(ఏబీపీఎం),డాక్‌ సేవక్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

● అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. స్థానిక భాషతోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

● ఎంపికైన అభ్యర్ధులకు టైం రిలేటెడ్‌ కంటిన్యూటీ అలవెన్స్‌ ప్రకారం జీతభత్యాలు చెల్లిస్తారు. బీపీఎం పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.12000 చెల్లిస్తారు.

● ఏబీపీఎం,డాక్‌సేవక్‌ పోస్టులకు నాలుగు గంటల టీఆర్‌సీఏ సబ్‌ ప్లాన్‌ కింద నెలకు రూ.10000 వేతనంగా చెల్లిస్తారు.

● ఎంపిక విధానానికి సంబంధించి పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. మెరిట్‌ లిస్ట్‌ ద్వారా తుది ఎంపిక నిర్వహిస్తారు.

● అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్‌ పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ మే 2,2022 నుండి ప్రారంభమౌతుంది.

●●● దరఖాస్తులకు చివరి తేది జూన్ 5,2022గా నిర్ణయించారు ●●●

◆ పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://indiapostgdsonline.gov.in పరిశీలించగలరు.



  

Post a Comment

0 Comments