GET MORE DETAILS

ఈరోజు మధ్వనవమి. మధ్వనవమి విశిష్టత

ఈరోజు మధ్వనవమి. మధ్వనవమి విశిష్టత 

 


మధ్వనవమి విశిష్టత : 

మాఘ శుక్ల నవమి మధ్వనవమిగా ప్రసిద్ధం. త్రిమతాచార్యుల్లో ఆఖరి అవతారం. శ్రీమధ్వాచార్యులు.

ఆయన ఆశ్వయుజ విజయదశమినాడు 1238లో దక్షిణ కన్నడ ఉడిపి వద్ద పాజక గ్రామంలో జన్మించారు.

మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట , వేదవతిలుగా పేర్కొన్నారు. ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టినా తరువాతి కాలంలో పూర్వ ప్రజ్ఞ , ఆనందతీర్థ , మధ్వాచార్యులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు. పన్నెండో ఏట అచ్యుతప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు.

బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మికత విషయాలవైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకళింపు చేసుకునేవారు. చిన్నవయసులోనే సకల శాస్త్రజ్ఞానం సంపాదించుకున్నందువల్ల పూర్ణ ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించారు. ద్వైతమతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్యేమార్గానికి చిహ్నంగా శ్రీమధ్వాచార్యులన్న నామధేయం కూడా వరించింది.

గొప్ప కార్యసాధకుడు అనటానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు. రుక్మిణీ దేవి పూజించే బాలకృష్ణ విగ్రహం ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్యాచార్యులవారే. శ్రీమధ్వాచార్యులవారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు, వారి చివరియాత్ర 1317లో 79వ ఏట పరిపూర్ణమైంది. 

ఆ తిరిగిరాని పయనమే మధ్వానవమి వైశిష్ట్యానికి సంప్రదాయంగా మారింది, ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశ వ్యాప్తంగా ఆరాధనా కార్యక్రమాలు నిర్వహిస్తారు. జీవుడు వేరు , బ్రహ్మము వేరు , జీవుడు మిథ్య కాదు , అలాగే జడ జగత్తు కూడా మిథ్యకాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగత్తులు కూడా అంత సత్యం , భక్తి ఒక్కటే ముక్తిదాయకం , అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండాలి. అని మధ్వాచార్యుడు ఆసేతుసీతనగ పర్యంతం దేశమంతా పర్యటించి ద్వైతమతాన్ని ప్రచారం చేశాడు. దేశంలో వైష్ణవమత వ్యాప్తికి , ముఖ్యంగా కృష్ణభక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడిందనటంలో సందేహం లేదు , జగత్తు మాయ మాత్రమే , జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే.

పరమాత్మ సర్వస్వతంత్రుడు , జీవాత్మ అస్వంతంత్రుడు , జీవోత్తముడు ఆచార్యుడు , ధర్మమార్గంలో ఆచార్యుల అనుగ్రహం సంపాదించి , అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తిముక్తావళి మధ్వులకు శిరోధార్యం. మధ్వాచార్యులు నిలిపిన సాంప్రదాయాలను పాటించేవారిని మధ్వులు లేదా మధ్వమతస్థులు అని పిలుస్తారు.

మధ్వాచార్యుడు,  హనుమంతుడు మరి భీముడు అనంతరము వాయుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు. తన ద్వైత సిద్ధాంతాన్ని నిరూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు , బ్రహ్మసూత్రాలకు , భగవద్గీతకు భాష్యాలు వ్రాశాడు. ఋగ్వేదంలోని 40 సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం వ్రాశాడు , తర్కంతోపాటు 37 గ్రంథాలను రచించాడు. 

మధ్వాచార్యులు అనంతరం మరే ఆచార్యులు భారతావనిలో పుట్టలేదు. వారు చేసిన ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు. ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని మాత్నే తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా , ఓడలోని ముఖ్య నావికుడు భక్తభావంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహూకరించాడు.

శ్రీమహావిష్ణువుయొక్క వివిధ అవతారాలను స్తుతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు , ఆ స్తోత్రమే తరువాత కాలంలో 3 ద్వాదశస్తోత్రంగా పిలువబడింది. ఆ గోపీచందనం మూటను మధ్వ సరోవరంలో శుద్ధిచేసి దానిని విప్పిన వీరికి ఆ గోపీచందనం కణికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది. 

ఆ విగ్రహాన్నే 800 సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు. తనను అమితంగా కొలిచే అంత్య కులజుడైన కనకదాసుని కరుణించి తూర్పు ముఖంగా వున్న శ్రీకృష్ణుడు పశ్చిమ ముఖుడై గవాక్షం గుండా అతనికి దర్శనం అనుగ్రహించాడు. 

ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనల్ని అనుగ్రహిస్తున్నాడు. మూఢ నమ్మకాల్ని వ్యతిరేకించాడు , యుక్తవయస్సులో కన్యాకుమారి , రామేశ్వరం , శ్రీరంగం మొదలైన క్షేత్రాలను సందర్శించారు మధ్వాచార్యులు ప్రవచించిన మతం ద్వైతం.  

జీవాత్మ , పరమాత్మలు రెండూ వేర్వేరుగా ఉంటాయని చెబుతారు. సృష్టిలో కంటికి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడిమీద ఆధారపడి వుంటుందని , ఆయనే ఈ సృష్టికి మూలకారకుడని తెలుపుతుంది. పరబ్రహ్మ ఒక్కడే. అతను విష్ణువు అని ప్రబోధించాడు. మధ్వ మతతత్వానికి వన్నెతెస్తున్న ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు.

పెజావర ,  పుత్తిగె , పాలిమార్ ,  ఆడనూరు , సోధె ,  కవియూరు , శిరూరు ,  కృష్ణాపురం మఠాలు. సంప్రదాయాలకు , మతపరమైన ఆచారాలకు , ద్వైత సిద్ధాంతాలకు ఉడిపి ప్రపంచవ్యాప్తంగా పేరు పొందింది. పురందరదాసు , కనకదాసు వంటి వాగ్గేయకారులకు ఉడిపి నిలయం కావటంతో దీనిని దాస సాహిత్య కేంద్రమని పేర్కొంటారు. మధ్వాచార్యులు తమ 79వ ఏట 1317లో శిష్యసమేతంగా బదరీ నారాయణుని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకుని వ్యాసభగవానుని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు.

మహానంద నవమి : 

శ్రీ మహానంద నవమి పండుగను గుప్త నవరాత్రుల చివరి రోజు అనగా నవమి తిథి నాడు జరుపుకుంటారు. గుప్త నవరాత్రులు మాఘ మాసంలోని శుక్ల పక్షంలో ఏకం అంటే ప్రతిపాదంలో మొదలవుతాయి మరియు చివరి రోజున నవమి తిథి నాడు మహానంద దేవిని పూజిస్తారు. గుప్త నవరాత్రుల నవమి తేదీని మహానంద నవమి అంటారు. జీవితంలో సుఖసంతోషాలు , శ్రేయస్సు , ధనం మరియు సంపదల కోసం ఈ ఉపవాసం ఆచరిస్తారు.

కొన్ని తెలియని కారణాల వల్ల జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం , డబ్బు , ధనానికి లోటు ఉంటే ఈ ఉపవాసం చాలా ముఖ్యమైనదని తెలుసుకోవాలి. అందుకే నవమి రోజున మహానంద వ్రతం పాటిస్తారు. 

మత గ్రంథాల ప్రకారం , నవరాత్రుల చివరి రోజున మహానంద నవమిని ఆరాధించడం మరియు మంత్రాన్ని పఠించడం వల్ల పేదరికం తొలగిపోతుంది మరియు చట్టం ప్రకారం లక్ష్మీ దేవిని ఆరాధించడం ద్వారా , ఇంటి దారిద్య్రం (పేద లేదా పేద అనే స్థితి) జీవితాన్ని అంతం చేస్తుంది. శ్రేయస్సు వస్తుంది. దాతృత్వం మరియు దాతృత్వానికి కూడా ఈ రోజు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నిస్సహాయులకు దానం చేయడం వలన సంతోషం మరియు శ్రేయస్సు మరియు విష్ణు లోకం ప్రాప్తి.

 ఈ రోజు ఏం చేయాలో తెలుసుకుందాం ?

బ్రహ్మ ముహూర్తంలో ఇంట్లోని చెత్తను సేకరించి ఇంటి బయట సూప్డి (పులుసు)లో వేయాలి. దీనిని అలక్ష్మి విసర్జన అంటారు. ఆ తరువాత , రోజువారీ పని నుండి విశ్రాంతి తీసుకున్న తరువాత , స్నానం చేసి , శుభ్రంగా ఉతికిన బట్టలు ధరించి , శ్రీమహాలక్ష్మిని ఆరాధించాలి. ఈ రోజున పూజా మందిరం మధ్యలో పెద్ద ఏకశిలా దీపం వెలిగించాలి. రాత్రి మేల్కొలుపు చేయాలి. మహాలక్ష్మీ మంత్రం - *'ఓం హ్రీం మహాలక్ష్మ్యై నమః'* అని జపించాలి.

రాత్రిపూట పూజ చేసిన తర్వాత ఉపవాసం విరమించాలి.

పౌరాణిక గ్రంధాలలో , నవమి రోజున కన్యకను పూజించి , ఆమె నుండి ఆశీర్వాదం తీసుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. కావున నవమి తిథి నాడు కన్యాభోజాన్ని మరియు ఆమె పాదాలను తాకాలి.

గుప్త నవరాత్రులలో ముఖ్యంగా 'శ్రీ' అంటే మహాలక్ష్మీ దేవిని పూజించి , ఉపవాసం మరియు ఉపవాసం తర్వాత , పెళ్లికాని ఆడపిల్లలకు భోజనం పెట్టాలి మరియు లక్ష్మీమాత మంత్రాలను పఠిస్తూ , హవనం చేయడం వల్ల ఇంటి దారిద్ర్యం తొలగిపోయి , ఇంటికి లక్ష్మి మరియు సంపదలు చేకూరుతాయి. మరియు జీవితం ఆనందం మరియు శ్రేయస్సుతో నిండి ఉంటుంది.

Post a Comment

0 Comments