GET MORE DETAILS

చిట్టి తంత్రాలు మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలు

చిట్టి తంత్రాలు మరియు ఆధ్యాత్మిక పరిష్కారాలు



● బాలారిష్ట దోషాలు తొలగటానికి ప్రతీ మంగళవారం పచ్చిపాలను పదకొండు సార్లు దిగ దుడుస్తూ ఆ పాలను నల్లని కుక్కకు పోయాలి. ఇలా పదకొండు లేక 21 రోజులు పోస్తుంటే బిడ్డకు బాలారిష్ట దోషాలు పోయి ఆరోగ్యం గా ఉంటారు.

● మీ ఇంట్లో పక్షులు త్రాగడానికి వీలుగా ఒక తొట్టెలో గానీ ఒక పాత్రలో గానీ నీటిని నింపండి. ఇలా రోజూ చేస్తుంటే కుటుంబం దినదినాభివృద్ధి చెందుతుంది.

● ఇంట్లో పెంచరాని వృక్షాలను పెంచినా దేవతా వృక్షాలను చెడు తిథి, నక్షత్రాలలో కొట్టేసినా ఆ ఇంట్లో నివశించే వారు మనఃశ్శాంతి కోల్పోతారు.

● నిత్యం భోజనం చేసే ముందు మీ పూర్వీకులను స్మరించడం వలన పితృదేవతల ఋణం తీర్చుకున్నట్లు అవుతుంది.

● ప్రతి రోజూ పక్షులకు పెసరు గుళ్ళను కొద్దిగా అన్నం వేయడం వలన విద్యార్థులకు విద్య అబ్బుతుంది. గృహస్తులు ఈ విధంగా చేయడం వలన సంతానంతో సఖ్యత కలుగుతుంది. సంతానం ఉన్నత స్థితి పొందుతారు.

● గోధుమ రంగు గోవుకు గరికె లేక నవధాన్యాలు పెడితే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది.

● వేయి ఎకరాల భూదానం చేస్తే లభించే ఫలం ఒక్క గోదానం తో సిద్ధిస్తుంది. 

● గర్భవతులు అయిన స్త్రీలు ప్రతీ రోజూ షష్టీ దేవిని స్మరించడం మంచిది. 

● ఉపదేశం పొందిన మంత్రాలను ఎప్పుడూ తూర్పు అభిముఖంగా కూర్చుని జపం చేయడం మంచిది. 

● ప్రతీ అమావాస్య రోజు కాళీ, దుర్గా,భైరవి, చంఢి వంటి ఉగ్రదేవతలను దర్శించుకోవడం వలన ఇతరులు మీకు చాలా సులభంగా వశం అవుతారు.

● ప్రతీ రోజూ మీరు నివశించే గృహానికి దగ్గరలో ఏ దేవత దేవాలయం ఉన్నా ఆ దైవాన్ని దర్శించుకోవడం వలన మీకు స్థాన బలం ఏర్పడుతుంది.

● 108 రోజులు ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాత శివునికి అభిషేకం చేయించుకోవడం వలన విద్య, ఉద్యోగం, వ్యాపారం లో ఎటువంటి ఒత్తిడి గానీ సమస్యలు కానీ కలుగవు. కుటుంబ పరమైన, భాగస్వామ్య వ్యాపార సమస్యలు, ఇతరుల వలన వచ్చే ఇబ్బందులు నాశనం అవుతాయి.

● లక్ష్మి అనుగ్రహం కావాలంటే బుధవారం, గురువారం లలో అష్ట గణపతులను,అష్ట లక్ష్మీలను కలిపి పూజించడం వలన తొందరగా ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది.

Post a Comment

0 Comments