GET MORE DETAILS

వైఎస్సార్ కళ్యాణ మస్తు షాదీ తోఫాకు కావాల్సిన అర్హతలు, విధి విధానాలు

వైఎస్సార్ కళ్యాణ మస్తు షాదీ తోఫాకు కావాల్సిన అర్హతలు, విధి విధానాలు 



✅ వైఎస్సార్ కళ్యాణమస్తు షాదీ తోఫాను అక్టోబర్ 1వ తేదీ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అమలు చేస్తారు.ఆ రోజు నవశకం -మేనేజ్మెంట్ పోర్టల్ ద్వారా అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తారు.

✅ వివాహ తేదీ నాటికి పధువు వయస్సు 18. వరుడి వయస్సు 21 ఏళ్లు నిండి ఉండాలి.తొలివివాహానికి మాత్రమే అర్హత.

✅ వధువు, వరుడు పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి. (ఈ షరతుకు 2024 జూన్ 30 వరకు సడలింపు ఇస్తారు)

✅ వరుడు, వధువు ఇద్దరి కుటుంబాల ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పది వేల రూపాయల్లోపు, పట్టణ ప్రాంతాల్లో 12 వేల రూపాయల్లోపు ఉండాలి.

✅ మూడు ఎకరాలకు మించి మాగాణి, లేదా పది ఎకరాలకు మించి మెట్ట భూమి ఉండరాదు. మెట్ట, మాగాణి రెండు కలిపి పది ఎకరాల్లోపు ఉండొచ్చు.

✅ కుటుంబాల్లో సభ్యులెవ్వరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగిగా, పెన్షనర్ గా ఉండకూడదు. 

✅ అయితే పారిశుధ్య కుటుంబాలకు మినహాయింపు ఉంది.

✅ నాలుగు చక్రాల వాహనం కలిగి ఉండకూడదు. (ట్యాక్సీలు, ట్రాక్టర్లు, ఆటోలకు మినహాయింపు)

☑️ నెలవారీ విద్యుత్ వినియోగం (గత 12 నెలల సగటు) 300 యూనిట్ల కంటే తక్కువగా ఉండాలి.

☑️ ఏ కుటుంబమూ ఆదాయపు పన్ను చెల్లింపుదారు కాకూడదు.

☑️ మునిసిపల్ ప్రాంతాల్లో 1,000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మించిన ఆస్తిని కలిగి ఉండకూడదు.

ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఈ పథకం నిర్వహణ ఉంటుంది.

Post a Comment

0 Comments