GET MORE DETAILS

దీపావళి ప్రప్రధమముగా జరుపుకున్న స్థలము, ఆంధ్రదేశము లోనే వున్నది.

దీపావళి ప్రప్రధమముగా జరుపుకున్న స్థలము, ఆంధ్రదేశములోనే వున్నది.



• విజయవాడ నుంచి అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే, నడకుదురు గ్రామము.

• ఆ గ్రామమునకు గల పురాతనమైన పేరు నరకాసుర సంహార క్షేత్రము. 

• ఆ గ్రామము పేరు, కాలక్రమేణా మారుతూ, నరకొత్తూరు, తర్వాత నడకుదురు గా మారింది.

• ఇక్కడ మహా సుందరమైన పచ్చని అరటి తోటల మధ్యన, శ్రీ పృథ్వీశ్వరాలయం ఉంది.

• సత్యభామాదేవి సాక్షాత్తు భూదేవి. నరకాసురుని సంహరించిన తర్వాత, అమ్మవారు ఈశ్వర ప్రతిష్ట చేసిందని స్థల పురాణము. 

• పృథ్వి అంటే భూదేవి, సత్యభామ.

• ఆ ఆలయము వద్దనే, శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహము కూడా వున్నది.

• నరకాసురుని ఇచ్చట సంహరించిన తర్వాత, మొదట మొదటగా నరక చతుర్దశి, దీపావళి జరుపుకున్నారు.

• నరకాసురుడు, స్వర్గలోకమునుంచి తెచ్చి పాటలీవృక్షము ను ఈ ఆలయము వద్ద నాటాడు. మన భారతదేశంలోనే గల ఏకైక వృక్షమిది. 5000 సంవత్సరములనాటిది. ఈ వృక్షమును ఇప్పటికీ మనము దర్శించుకోవచ్చు.

• బిడ్డలు లేని వారు, ఈ చెట్టుకు ఉయ్యాల కడితే, తప్పక సంతానవంతులౌతారు.

• విజయవాడ నుంచి, అవనిగడ్డ వెళ్ళే కృష్ణానది కరకట్ట మీదుగా వెళితే, సుమారు 50 కి.మీ. దూరంలో ఈ నడకుదురు గ్రామము చేరుకోవచ్చు.

Post a Comment

0 Comments