పెరిగిన ఎస్బీఐ ఏటీఎం చార్జీలు
ఇతర బ్యాంకుల ఏటీఎం లావాదేవీలపై చార్జీలను ఎస్బీఐ మార్చింది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో నెలకు ఐదు ఉచిత లా వాదేవీల పరిమితిని కొనసాగిస్తూనే, ఆపై చేసే విత్డ్రాయల్స్పై చార్జీలను పెంచింది. ఉచిత పరిమితి ముగిశాక డబ్బు తీస్తే రూ.23 తో పాటు జీఎస్టీ చెల్లించాలి. గతంలో ఇది రూ.21 గా ఉండేది. బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి ఆర్థికేతర లావాదేవీలకు రూ.11తోపాటు జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో ఇది రూ.10గా ఉంది. సాలరీ కస్టమర్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరికి గతంలో ఇతర బ్యాంకుల ఏటీఎం లలో అపరిమిత ఉచిత లావాదేవీలు ఉండేవి. గత నెల నుంచి ఈ పరిమితి నెలకు 10కి తగ్గింది. ఆ తర్వాత చేసే లావాదేవీలకు చార్జీలు ఉంటాయి. ఎస్బీఐ ఏటీఎంలలో ఎస్బీఐ కార్డులు వాడేవారికి మార్పు లేదు. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతా (బీఎసీబీడీ) ఖాతాదారులకూ పాత చార్జీలే వర్తిస్తాయి.
.jpeg)
0 Comments