GET MORE DETAILS

బలి పాడ్యమి - కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు.

  బలి పాడ్యమి - కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు.





కార్తీక శుద్ధ పాడ్యమికే బలి పాడ్యమి అని పేరు. ఈ పాడ్యమి బలిచక్రవర్తికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు తెల్లవారుజామునే లేచి బలిచక్రవర్తిని పూజించాలి. బియ్యపు పిండితో బలిచక్రవర్తి బొమ్మ్ను గీచి పూజ చేయవచ్చు. పూజ సమయంలో "బలిరాజ నమస్తుభ్యం విరోచనసుత ప్రభో , భవిష్యేంద్ర సురారాతే పూజేయం ప్రతిగృహ్యతాం" అని ప్రార్ధించాలని , గోవర్ధనపూజ చేయాలని , ఆవులను అలంకరించి స్వేచ్చగా తిరగనివ్వాలని , శక్తి కొలది దానం చెయాలని చెప్తారు. 


ఇది బలిచక్రవర్తికి సంబంధించిన కధ. వామనుడైన విష్ణువుకు 'మాట తిరుగని మానధనుడైన బలిచక్రవర్తి తన సర్వస్వాన్ని దానం చేశాడు. అందుకు సంతోషించిన విష్ణువు వరం కోరుకోమన్నాడు.


అప్పుడు బలిచక్రవర్తి "దేవా ! నా సర్వస్వాన్ని నీకు సమర్పించాను. నాకోసం కోరడానికి ఏమి లేదు. లోకం కోసం ఒక వరం అర్ధిస్తున్నాను. ఇష్టమైతే అనుగ్రహించు. నేను దానమిచ్చిన భూమిని వామనుడివై అంతటా ఆక్రమించావు. కనుక నీ మూడు అడుగులకు సంకేతంగా - ఆశ్వయుజ బహుళ చతుర్దశి , అమావాస్య , కార్తీక శుద్ధ పాడ్యమి(3 రోజులు)- భూలోకంలో బలిచక్రవర్తి రాజ్యంగా ఉండాలి. నా రాజ్యంలో దీపదానం , దీప పూజ చేసే ఇంట్లో నీ భార్య లక్ష్మీ దేవి శాశ్వతంగా ఉండాలి. నా రాజ్యంలో ఎవరి ఇంట అంధకారం ఉంటుందో వాళ్ళ ఇంట ఎప్పటికి చీకటే ఉండాలి" అన్నాడు. విష్ణువు తధాస్తు అన్నాడు.


బలిచక్రావర్తి కార్తీక శుద్ధ పాడ్యమి - తాను పాలించిన భూలోకాన్ని చూడడానికి సాయంకాలం వస్తాడు. అతనివెంట గదాధరుడైన భగవంతుడు మహావిష్ణువు వస్తాడు. ఇలా భక్తుడూ , భక్తరక్షకుడైన భవంతుడు - ఇద్దరు వస్తారు కనుక వీధులు శుభ్రంగా ఉండి , ప్రతి ఇంటి ముంగిట దీపాలూ , మామిడితోరణాలు , రంగురంగుల ముగ్గులూ ఉండటం చూసి , తన రాజ్యంలో ప్రజలందరూ ఆనందం , ఉత్సాహం , భోగభాగ్యాలతో హాయిగా ఉన్నారని బలి సంతోషపడతాడు. భగవంతుడు ఆనందిస్తాడు. అందువల్ల దీపావళి మరుసటి రోజు 

'బలి పాడ్యమి' అయ్యింది. అంతేకాని జంతుబలులతో విందుచేసుకోవడం బలి పాడ్యమి కాదు.

Post a Comment

0 Comments