GET MORE DETAILS

పీఆర్‌సీ ఇవ్వాలన్నదే ప్రధాన డిమాండ్ ‌: వెంకట్రామిరెడ్డి

పీఆర్‌సీ ఇవ్వాలన్నదే ప్రధాన డిమాండ్ ‌: వెంకట్రామిరెడ్డి



ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ పీఆర్‌సీతోపాటు ఇతర డిమాండ్లనూ పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టంచేశారు. పీఆర్‌సీపై చర్చించడానికి ప్రభుత్వం ముందుకొస్తే కొన్ని సంఘాలు ఎందుకు ఆందోళన చేస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు. శుక్రవారం సచివాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘‘సొంత ప్రయోజనాల కోసం కొన్ని ఉద్యోగ సంఘాలు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నాయి. పీఆర్‌సీపై ఉద్యోగులతో ప్రభుత్వం సంప్రదిస్తుందని, సంప్రదించబోదని నేనెక్కడా చెప్పలేదు. ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేస్తున్నానని నాపై విమర్శలు చేయడం ఆయా సంఘాలకు తగదు. బొప్పరాజు సొంతంగా ఏ సంఘంలోనైనా గెలిచారా? ఏపీ ఎన్‌జీవో సంఘం తన గుంటూరు విభాగం అధ్యక్షుడిని రాత్రికిరాత్రి ఎందుకు తప్పించిందో సమాధానం చెప్పాలి. త్వరలో పీఆర్‌సీ అంశం పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు.

Post a Comment

0 Comments