Omicron : దేశంలో 70దాటిన ఒమిక్రాన్ కేసులు.. హోంశాఖ సమీక్ష !
దేశంలో ఆందోళనకర వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పది రాష్ట్రాలకు విస్తరించింది. గురువారం నాటికి దేశవ్యాప్తంగా 70కి పైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కేవలం ఒక్క మహారాష్ట్రలోనే 32 ఒమిక్రాన్ కేసులు వెలుగు చూశాయి. రాజస్థాన్లో 17 మందిలో ఈ వేరియంట్ బయటపడింది. దిల్లీలో నేడు కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు రికార్డయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్-19 పరిస్థితులపై కేంద్ర హాంశాఖ సమీక్ష నిర్వహించింది.
0 Comments