GET MORE DETAILS

పిల్లల్లో కరోనా కొత్త లక్షణాలు - కడుపు నొప్పి, వాంతులు. పరీక్షిస్తే పాజిటివ్ : ఇప్పటికే గాంధీలో అయిదుగురు చిన్నారుల చేరిక

పిల్లల్లో కరోనా కొత్త లక్షణాలు - కడుపు నొప్పి, వాంతులు. పరీక్షిస్తే పాజిటివ్ : ఇప్పటికే గాంధీలో అయిదుగురు చిన్నారుల చేరిక



ఒమిక్రాన్ వేరియంట్ రూపంలో కరోనా మూడో దశ విజృంభిస్తోంది. పిల్ల లపై కూడా ప్రభావం చూపుతోంది. తెలుగు రాష్ట్రాల్లో అనూహ్యంగా కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో 23-30 శాతం మంది పిల్లలు ఒమిక్రాన్ బారిన పడుతు న్నారు. మన వద్ద కూడా పిల్లల్లో కేసులు నమోదవుతు న్నాయి. డెల్టా వేరియంట్ తో పోలిస్తే ఒకటి రెండు కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతు న్నారు. కొందరు చిన్నారులకు కడుపు నొప్పి రావడం తోపాటు వాంతులు అవుతున్నాయి. జ్వరం, ఇతర సమ స్యలు తక్కువగా కనిపిస్తున్నాయి. చాలామంది తల్లి దండ్రులు దీనిని అజీర్ణ సమస్యగా భావిస్తున్నారు. ప్రాథమిక వైద్యంతో కొందరిలో తగ్గిపోతోంది. మరికొం దరు మాత్రం వైద్యులను సంప్రదిస్తున్నారు. పరీక్షలు చేస్తే కరోనా ఉన్నట్లు నిర్ధారణ అవుతోంది. డెల్టా వేరి యంట్లో పిల్లల్లో కడుపు నొప్పి కనిపించేది కాదని,అప్పట్లో వాంతులు, విరేచనాలు, జలుబు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది లాంటి సమస్యలను గుర్తించామని వైద్యులు చెబుతున్నారు

ఆక్సిజన్ పై ఇద్దరు :

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రి పిల్లల వార్డులో అయిదు గురు చిన్నారులు కరోనాకు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఇద్దరికి ఆక్సిజన్ తో చికిత్స అందిస్తున్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలి పారు. ప్రస్తుతం పిల్లల్లో తలనొప్పి, 101-102 డిగ్రీల జ్వరం, కడుపులో నొప్పి, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలు ఉంటే కరోనాగా భావించి పరీక్షలు చేయించా లని సూచిస్తున్నారు.

మాస్క్ లు ధరించేందుకు అవకాశం లేక...

మూడోదశ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో 5 ఏళ్లలోపు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వారికి మాస్క్ పెట్టడం లేదు. పెట్టినా వారు కిందకు లాగేస్తుంటారు. దీంతో ఎక్కువ శాతం వీరు ముప్పు కేటగిరిలో ఉంటారు. ఈ వయస్సు పిల్లలకు టీకాలు కూడా ఇంకా అందుబాటు లోకి రాలేదు. ఈ తరుణంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలని చిన్న పిల్లల వైద్య నిపుణులు మంచుకొండ రంగయ్య సూచించారు.

Post a Comment

0 Comments