GET MORE DETAILS

లక్ష్మీదేవి మన శరీరంలో ఏఏ స్థానంలో నివాసముంటే ఎలాంటి ఫలితాలు ప్రాప్తిస్తాయో చూడండి.

లక్ష్మీదేవి మన శరీరంలో ఏఏ స్థానంలో నివాసముంటే ఎలాంటి ఫలితాలు ప్రాప్తిస్తాయో చూడండి.



బాల మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి. ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారు ఉండరు. అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు.

• అమ్మవారు పాద స్థానములో ఉంటే ఆ మానవులకు పెద్ద పెద్ద భవంతులు , విలాస వంతమైన గృహాలు లభిస్తుంది !

• తొడలలో అమ్మవారు శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది !

• గుహ్య భాగంలో ఉంటే భార్యసుఖసాంసారిక ఆనందం కలుగుతుంది !

• రొమ్ము భాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్దిస్తూ ఉంటుంది !

• కంఠ భాగంలో ఆ తల్లి తేజస్సు ఉన్నపుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది !

• ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి ! మధురమైన కవిత పాండిత్యం , జ్ఞానశక్తి లభిస్తాయి !

• ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో... వారి దగ్గర లక్ష్మీదేవి నిలబడదు .... 

• వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలిన తనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు అని శ్రీ దత్తాత్రేయ స్వామి వారు దేవతలకు బోధించారట.

లక్ష్మీదేవికి ప్రీతికరమైన వస్తువులు :

▪️ దక్షిణావర్తన శంఖం 

▪️ ముత్యాల శంఖం

▪️ ఏకాక్షి నారికేళం.

ఈ వస్తువులను పూజా మందిరంలో వుంచి భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది.

దక్షిణావర్తన శంఖం :

ఈ శంఖం కడుపు ఊదే వారి కుడి వైపుకు తెరుచుకొని ఉంటుంది. ఇలాంటి శంఖాన్ని దక్షిణావర్తన శంఖం అంటారు. దీనికి వ్యతిరేక దిశలో తెరచుకొని ఉండేవి వామావర్తి శంఖమని అంటారు.

లక్ష్మీదేవికి ఈ శంఖమంటే ఎందుకు అంత ఇష్టం అంటే లక్ష్మీదేవి సముద్రము నుండి జన్మించింది.ఈ శంఖం కూడా మనకు సముద్రంలోనే దొరకుతాయి.

మనకు సామాన్యంగా దొరికేవి వామావర్తి శంఖలే కావడం విశేషం.

అయితే దక్షిణావర్త శంఖం దొరకడం కష్టసాధ్యమే అయినా ఈ శంఖాన్ని లక్ష్మీదేవి సోదరిగా వర్ణిస్తారు మునిశ్రేష్టులు. 

దక్షిణావర్తి శంఖాలు మ్రోగవు.కానీ మ్రోగేవి దొరికితే పూజామందిరంలో పెట్టుకొని పూజించాలి.

పగిలినవి , విరిగినవి , పల్చని పొర కలిగినవి , గరుకైన ముక్కు , రంధ్రాలు ఉన్నవి పూజాకు పనికి రావు. 

ఈ శంఖాలు ఉన్న ఇంట్లో అష్టైశ్వర్యాలు సమకూరుతాయని ప్రసిద్ధి. ఈ శంఖాలు కన్యాకుమారి , రామేశ్వరంలో దొరుకుతాయని ప్రసిద్ధి .

ముత్యపు శంఖం : 

ముత్యపు శంఖం కనతిలో గుండ్రంగా ఉండే శంఖం ఇది. ఈ శంఖం కూడా అత్యంత అరుదుగా దొరికేవే.

ఈ శంఖాన్ని బుధవారం రోజు...

"ఓం శ్రీం హ్రీం దారిద్ర్య వినాశిన్యై

ధనదాన్య సంరుద్ధిం దేహి దేహి నమః"

అని ఈ మంత్రాన్ని 108 సార్లు స్మరిస్తూ పూజిస్తే సకల దారిద్ర్యాలు దూరమవుతాయి . ఏకాక్షి నారికేళం సాధారణంగా కొబ్బరికాయలకు రెండు కళ్ళు ఉంటాయి. 

కానీ అరుదుగా దొరికే ఒకే కన్ను (ఒంటి కన్ను) నారికేళం ఉంటుంది. ఈ ఏకాక్షి నారికేళాన్ని ఒక పళ్ళెంలో చందనం, కుంకుమ వేసి వాటిపై అష్టదళ ముగ్గు వేసి దానిపై ఏకాక్షి నారికేళాన్ని ఎర్రనివస్త్రంలో ఉంచి అభిషేకిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ధనలాభం చేకూరుతుంది.


లోకా సమస్తా సుఖినో భవంతు.

Post a Comment

0 Comments